Movie News

షాకింగ్.. ట్రైలర్ చూడాలంటే డబ్బులు పెట్టాలట

కంటెంట్ క్వాలిటీ ఎలాగైనా ఉండనీ.. జనాల్ని ఏదో రకంగా ఆకర్షించి డబ్బులు చేసుకోవడంలో రామ్ గోపాల్ వర్మను మించిన వాళ్లు లేరు. ఆయన సినిమా ఒకటి చూసి చెడామడా తిట్టుకుని, ఇంకెప్పుడూ వర్మ సినిమా చూడకూడదు అని బలంగా నిర్ణయించుకున్న వాళ్లను మళ్లీ ఏదో రకంగా ఆకర్షించి తన కొత్త సినిమా చూసేలా చేయగల దిట్ట వర్మ. షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూత పడ్డ ఈ లాక్ డౌన్ టైంలో కూడా ఆయన.. సినిమాలు తీస్తున్నారు. తన ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్’ ద్వారా ఆన్ లైన్లో రిలీజ్ చేసి సొమ్ము చేసుకుంటున్నాడు.

పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమాకు రూ.100 రేటు పెట్టి కోట్లలో సంపాదించిన వర్మ.. ఆ తర్వాత ‘నేక్డ్’ పేరుతో లోకల్ బూతు బొమ్మకు రూ.200 రేటు పెట్టి దాని ద్వారా కూడా బాగానే ఆర్జించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ కాబోతున్న కొత్త సినిమా ‘పవర్ స్టార్’. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన సినిమా ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిన ‘తొలి ప్రేమ’ రిలీజైన జులై 24నే ఈ చిత్రం కూడా రిలీజవుతుందని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే.

ఐతే త్వరలో ‘పవర్ స్టార్’ ట్రైలర్ వదలబోతున్నాడు వర్మ. కానీ అందరిలా దాన్ని యూట్యూబ్‌లో ఫ్రీగా చూపించేయట్లేదు వర్మ. ఆ ట్రైలర్ చూడటానికి కూడా రేటు పెడుతున్నాడట. రూ.50 దాకా డబ్బులు పెడితే తప్ప ఆ ట్రైలర్ చూడలేరట. ప్రపంచంలో ఇలా ట్రైలర్‌ను కూడా అమ్మకానికి పెట్టిన తొలి ఫిలి మేకర్ వర్మే కావచ్చు. సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అందరూ ట్రైలర్ చూస్తారు. దాన్ని ఎక్కువమంది చూస్తే సినిమాకు ప్రయోజనం అని ఫిలిం మేకర్స్ భావిస్తారు. కానీ దానికి కూడా రేటు పెట్టాలన్న వర్మ ఆలోచన అనూహ్యం.

This post was last modified on July 14, 2020 2:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

4 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

4 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

6 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

7 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

7 hours ago