శ్వాస కోశ సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. మంగళవారం తెల్లవారు జామును 4 గంటలకు తుదిశ్వాస విడిచిన తెలుగు తెర వజ్రాయుధం.. కృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్లోని పద్మాలయా స్టూడియోస్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తాడేపల్లి నుంచి నేరుగా పద్మాలయా స్టూడియోస్కు చేరుకుని.. సూపర్స్టార్ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కృష్ణ కుమారుడు, యువ హీరో మహేష్ బాబును సీఎం జగన్ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అన్ని విధాలా కుటుంబానికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. కొద్ది సేపు మహేష్ తో మాట్లాడి కృష్ణ అస్వస్థతకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. సీఎం జగన్ను కలిసేందుకు వచ్చిన వారిని మౌనంగానే పలకరించి.. అక్కడ నుంచి నిష్క్రమించారు.
కాగా, మంగళవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచిన హీరో కృష్ణకు బుధవారం తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, తమ అగ్ర హీరో మృతి చెందారన్న వార్తతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆయన అభిమానులు తండోపతండాలుగా హైదరాబాద్కు చేరుకున్నారు.
పత్రికలకు డిమాండ్.. మళ్లీ ముద్రణ
అభిమానుల రాకతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ వీధులు జనసంద్రాలు కనిపించాయి. ఎటు చూసినా.. కృష్ణ నామస్మరణ వినిపించింది. అదేసమయంలో పత్రికల కొనుగోళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఎప్పుడూ.. మధ్యాహ్నం.. 3గంటల వరకు కూడా కిళ్లీ షాపుల్లో దర్శనమిచ్చే పత్రికలు .. బుధవారం ఉదయం 7 గంటలకే అయిపోయాయి. దీంతో కొన్ని పత్రికల యాజమాన్యాలు.. మరోసారి లక్ష కాపీల చొప్పున ముద్రించి బుధవారం ఉదయం పంపిణీ చేయడం గమనార్హం.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…