నవంబరు బాక్సాఫీస్ అనుకున్నట్లుగానే డల్లుగా నడుస్తోంది. తొలి వారంలో విడుదలైన ‘ఊర్వశివో రాక్షసివో’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇక గతవారం విడుదలైన ‘యశోద’ పరిస్థితి అంత గొప్పగానూ లేదు. అలాగని తీసిపడేసేలాగా కూడా లేదు. వీకెండ్ వరకు బాగానే ఆడిన సినిమా.. ఆ తర్వాత డల్లయింది. ఇక ఈ వారానికి చెప్పుకోదగ్గ సినిమాలే కనిపించడం లేదు.
వేరే సమయాల్లో థియేటర్ల దొరక్క ఇబ్బంది పడుతున్నా ప్రతి వారం ఇబ్బడిముబ్బడిగా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. కానీ ఈ వారానికి బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నా కొత్త సినిమాలు ఆసక్తి చూపించట్లేదు. ‘మసూద’ అనే హారర్ మూవీ మాత్రమే చెప్పుకోదగ్గ రిలీజ్. ఈ వారం సరైన పోటీ లేకపోవడం చూసి తమిళ బ్లాక్ బస్టర్ ‘లవ్ టుడే’ను రిలీజ్ చేయడానికి అగ్ర నిర్మాత దిల్ రాజు రెడీ అయ్యాడు.
తమిళంలో ఈ నెల 4న రిలీజై అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తుండడంతో ఆలస్యం చేయకుండా తెలుగు డబ్బింగ్ హక్కులు తీసుకుని చకచకా సినిమాను రిలీజ్కు రెడీ చేయించాడు రాజు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ విజయ్ దేవరకొండ చేతుల మీదుగా లాంచ్ కావాల్సింది. కానీ సూపర్ స్టార్ కృష్ణ హఠాన్మరణంతో ఆ కార్యక్రమం ఆపేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఉన్న విషాదభరిత మూడ్లో ‘లవ్ టుడే’ సినిమాను ప్రమోట్ చేయడం, హడావుడి చేయడం బాగుండదని భావించి రాజు మొత్తంగా రిలీజ్ విషయంలోనే వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ అనగా ఈ సినిమాకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు. దీన్ని బట్టి ఈ వారం సినిమా రిలీజ్ కావట్లేదని స్పష్టం అవుతోంది. ఈ చిత్ర హీరో హీరోయిన్లు మనవాళ్లు పరిచయం లేదు. మన జనాలకు ఈ సినిమా గురించి కూడా పెద్దగా తెలియదు. అలాంటపుడు ప్రమోషన్ల పరంగా హడావుడి చేస్తే తప్ప జనాల్లోకి సినిమా వెళ్లదు. కృష్ణ మరణం నేపథ్యంలో అలాంటి హడావుడి బాగుండదనే రాజు సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే వారం సినిమా రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on November 16, 2022 12:30 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…