samantha
నవంబరు నెలలో కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ ఆశాజనకంగా ఉండట్లేదు. టాక్ బాగున్న సినిమాలకు కూడా వసూళ్లు రావట్లేదు. ఈ నెల మొదటి వారంలో రిలీజైన ‘ఊర్వశివో రాక్షసివో’కు మంచి టాక్ వచ్చింది. అది యూత్ను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. అయినా సరే.. ఆ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు.
వీకెండ్లోనే ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకున్న ఆ చిత్రం.. ఆ తర్వాత మరింత డల్ అయిపోయింది. ఇలాంటి టైంలో సమంత నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’ గత వీకెండ్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద మరీ హైప్ ఏమీ లేదు. అలాగని ప్రేక్షకులు పట్టించుకోకుండా కూడా ఏమీ లేదు. ఐతే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కీలకంగా భావించారు. కానీ ‘యశోద’ డివైడ్ టాక్తో మొదలైంది. కాన్సెప్ట్ బాగున్నా, కొత్తగా అనిపించినా.. ఆశించినంత ఆసక్తికరంగా దాన్ని ప్రెజెంట్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఇలాంటి టాక్తో ‘యశోద’ ఏమాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడుతుందో అనుకున్నారు. కానీ ఇక్కడే సమంత బాక్సాఫీస్ స్టామినా అక్కరకు వచ్చింది. తొలి రోజు వరల్డ్ వైడ్ రూ.3 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యపరిచింది సమంత. నాగ్ సినిమా ‘ది ఘోస్ట్’, నాగచైతన్య మూవీ ‘థాంక్యూ’ కంటే ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ఎక్కువ కావడం విశేషం. ఐతే టాక్ బాగా లేని సినిమాకు వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అవుతాయి కానీ.. ‘యశోద’కు మాత్రం కలెక్షన్లు కాస్త నిలకడగానే ఉన్నాయి. 2, 3 రోజుల్లోనూ తొలి రోజుకు దీటుగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం.
తెలుగు రాష్ట్రాల వరకు ‘యశోద’ షేర్ రూ.5 కోట్ల మార్కును దాటింది. యుఎస్లో ఈ చిత్రం 4 లక్షల డాలర్ల మార్కుకు చేరువగా వెళ్తోంది. బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉన్న టైంలో ఇలాంటి టాక్తో ఈ వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. ఇది సమంత స్టార్ పవర్ను సూచించేదే. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమే అనడంలో సందేహం లేదు. సినిమాను కూడా ఆమే తన భుజాల మోసిందనడంలో అతిశయోక్తి లేదు.
This post was last modified on November 14, 2022 6:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…