ఈ రోజుల్లో తమ అభిమానులను సంతృప్తి పరచడం హీరోలకు పెద్ద టాస్క్గా మారిపోయింది. అంటే కేవలం మంచి సినిమాలు తీసి వారిని ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు.. సినిమా మొదలైన దగ్గర్నుంచి సమయానుకూలంగా అప్డేట్స్ ఇస్తుండాలి.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి వాటితో వారిని మెప్పించాలి. సినిమాను బాగా ప్రమోట్ చేసి హైప్ పెంచాలి. ఇవి చేయకపోతే అభిమానులకు కోపం వచ్చేస్తుంది.
తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో ఇలాంటివి పాటించకపోతే ప్రొడక్షన్ హౌస్లకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసన తెలియజేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. సాహో సినిమా విషయంలో యువి క్రియేషన్స్ మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలోనే గొడవ చేశారు యువి ఆఫీస్ ముందు. ఇక ఆన్ లైన్ ఉద్యమాల సంగతి అయితే సరేసరి.
ఐతే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ను అనుకరించే ప్రయత్నం చేశారు. పుష్ప-2 సినిమాకు సంబంధించి తమకు అప్డేట్ కావాలంటూ ఒక పదిమంది గుమిగూడి గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు గొడవ చేశారు. ఐతే ఇదంతా కూడా పీఆర్ స్టంటులాగా అనిపించింది తప్ప.. ఒరిజినాలిటీ కనిపించట్లేదన్నది సోషల్ మీడియా టాక్. అయినా పుష్ప-2 సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమా గురించి ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్లో బన్నీ మాట్లాడాడు. త్వరలోనే అప్డేట్ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాడు.
ఇక సినిమా షూట్ ఇటీవలే మొదలు కావడం, టీజర్ కంటెంట్ రెడీ చేయడం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. డిసెంబరు 16న రిలీజవుతున్న అవతార్-2 సినిమా థియేటర్లలో దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా అప్డేట్ కావాలంటూ ఊరికే హంగామా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. బన్నీ క్రేజ్ చూపించడానికి పీఆర్ టీం ఈ స్టంట్ చేయించిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
This post was last modified on November 14, 2022 6:57 am
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…