ఈ రోజుల్లో తమ అభిమానులను సంతృప్తి పరచడం హీరోలకు పెద్ద టాస్క్గా మారిపోయింది. అంటే కేవలం మంచి సినిమాలు తీసి వారిని ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు.. సినిమా మొదలైన దగ్గర్నుంచి సమయానుకూలంగా అప్డేట్స్ ఇస్తుండాలి.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి వాటితో వారిని మెప్పించాలి. సినిమాను బాగా ప్రమోట్ చేసి హైప్ పెంచాలి. ఇవి చేయకపోతే అభిమానులకు కోపం వచ్చేస్తుంది.
తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో ఇలాంటివి పాటించకపోతే ప్రొడక్షన్ హౌస్లకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసన తెలియజేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. సాహో సినిమా విషయంలో యువి క్రియేషన్స్ మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలోనే గొడవ చేశారు యువి ఆఫీస్ ముందు. ఇక ఆన్ లైన్ ఉద్యమాల సంగతి అయితే సరేసరి.
ఐతే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ను అనుకరించే ప్రయత్నం చేశారు. పుష్ప-2 సినిమాకు సంబంధించి తమకు అప్డేట్ కావాలంటూ ఒక పదిమంది గుమిగూడి గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు గొడవ చేశారు. ఐతే ఇదంతా కూడా పీఆర్ స్టంటులాగా అనిపించింది తప్ప.. ఒరిజినాలిటీ కనిపించట్లేదన్నది సోషల్ మీడియా టాక్. అయినా పుష్ప-2 సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమా గురించి ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్లో బన్నీ మాట్లాడాడు. త్వరలోనే అప్డేట్ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాడు.
ఇక సినిమా షూట్ ఇటీవలే మొదలు కావడం, టీజర్ కంటెంట్ రెడీ చేయడం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. డిసెంబరు 16న రిలీజవుతున్న అవతార్-2 సినిమా థియేటర్లలో దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా అప్డేట్ కావాలంటూ ఊరికే హంగామా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. బన్నీ క్రేజ్ చూపించడానికి పీఆర్ టీం ఈ స్టంట్ చేయించిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
This post was last modified on November 14, 2022 6:57 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…