ఈ రోజుల్లో తమ అభిమానులను సంతృప్తి పరచడం హీరోలకు పెద్ద టాస్క్గా మారిపోయింది. అంటే కేవలం మంచి సినిమాలు తీసి వారిని ఎంటర్టైన్ చేయడం మాత్రమే కాదు.. సినిమా మొదలైన దగ్గర్నుంచి సమయానుకూలంగా అప్డేట్స్ ఇస్తుండాలి.. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లాంటి వాటితో వారిని మెప్పించాలి. సినిమాను బాగా ప్రమోట్ చేసి హైప్ పెంచాలి. ఇవి చేయకపోతే అభిమానులకు కోపం వచ్చేస్తుంది.
తమ అభిమాన హీరోల సినిమాల విషయంలో ఇలాంటివి పాటించకపోతే ప్రొడక్షన్ హౌస్లకు వ్యతిరేకంగా ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో నిరసన తెలియజేస్తున్న ఉదంతాలు చూస్తున్నాం. సాహో సినిమా విషయంలో యువి క్రియేషన్స్ మరీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలోనే గొడవ చేశారు యువి ఆఫీస్ ముందు. ఇక ఆన్ లైన్ ఉద్యమాల సంగతి అయితే సరేసరి.
ఐతే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ప్రభాస్ ఫ్యాన్స్ను అనుకరించే ప్రయత్నం చేశారు. పుష్ప-2 సినిమాకు సంబంధించి తమకు అప్డేట్ కావాలంటూ ఒక పదిమంది గుమిగూడి గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు గొడవ చేశారు. ఐతే ఇదంతా కూడా పీఆర్ స్టంటులాగా అనిపించింది తప్ప.. ఒరిజినాలిటీ కనిపించట్లేదన్నది సోషల్ మీడియా టాక్. అయినా పుష్ప-2 సినిమాను నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. ఈ సినిమా గురించి ఇటీవలే ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్లో బన్నీ మాట్లాడాడు. త్వరలోనే అప్డేట్ ఉంటుందన్న సంకేతాలు ఇచ్చాడు.
ఇక సినిమా షూట్ ఇటీవలే మొదలు కావడం, టీజర్ కంటెంట్ రెడీ చేయడం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. డిసెంబరు 16న రిలీజవుతున్న అవతార్-2 సినిమా థియేటర్లలో దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదంతా తెలిసి కూడా అప్డేట్ కావాలంటూ ఊరికే హంగామా చేయడం ఏంటో అర్థం కావడం లేదు. బన్నీ క్రేజ్ చూపించడానికి పీఆర్ టీం ఈ స్టంట్ చేయించిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
This post was last modified on November 14, 2022 6:57 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…