Movie News

మహేష్-త్రివిక్రమ్.. అసలేం జరుగుతోంది?

టాలీవుడ్లో ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యే కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. రెండో చిత్రం ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ సినిమా రిలీజైన పుష్కరం తర్వాత మళ్లీ ఈ కలయికలో సినిమా వస్తోందని అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు.

ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఎట్టకేలకు నెల కిందట చిత్రీకరణ మొదలవడంతో అందరూ హ్యాపీగా కనిపించారు. చెప్పినట్లే వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజవుతుందని అనుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. తొలి షెడ్యూల్ తర్వాత షూటింగ్ ఆగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని.. మళ్లీ వర్క్ జరుగుతోందని.. మార్పులు చేర్పులు ఏవో జరుగుతున్నాయని. గుసగుసలు వినిపించాయి.

ఒక దశలో సినిమా ఆగిపోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఐతే తాజా సమాచారం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులతో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకున్నారట. ఇంతకుముందు అనుకున్నట్లు సినిమాలో యాక్షన్ డోస్ తగ్గిస్తున్నారని.. కథలో కూడా కీలక మార్పులు జరిగాయని అంటున్నారు.

కొందరేమో ముందు అనుకున్న కథను పూర్తిగా పక్కన పెట్టేశారని, కొత్త కథతో జర్నీ మొదలుపెట్టనున్నారని.. ఇంతకుముందు తొలి షెడ్యూల్లో తీసిన యాక్షన్ ఎపిసోడ్‌ను డస్ట్ బిన్‌లో పడేశారని కూడా అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్‌ను తప్పంచేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ తమన్‌తో త్రివిక్రమ్‌కు ఈ మధ్య బాగా సింక్ అవుతుండటం.. ఇద్దరి కలయికలో రెండు సూపర్ హిట్ ఆల్బమ్స్ రావడాన్ని దృష్టిలో ఉంచుకుని సంగీత దర్శకుడిని మార్చే అవకాలు అంతగా కనిపించడం లేదు. డిసెంబరు తొలి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.

This post was last modified on November 13, 2022 10:27 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

బన్నీ.. పవన్ కోసమేనా అలా?

మెగా ఫ్యామిలీ హీరోనే అయినప్పటికీ అల్లు అర్జున్ విషయంలో చాలా ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానుల్లో వ్యతిరేకత ఉంది.…

2 hours ago

తారక్ బంధం గురించి రాజమౌళి మాట

దర్శకధీర రాజమౌళి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఎంత బంధం ఉందో చాలాసార్లు బయటపడిందే అయినా ప్రతిసారి కొత్తగా…

3 hours ago

తులం బంగారం రూ.2 లక్షలు!

సరిగ్గా మూడేండ్ల క్రితం రూ.40 వేలు తులం ఉన్న బంగారం ధర ఇప్పుడు రూ.70 వేల మార్క్ ను దాటిపోయింది.…

3 hours ago

టీడీపీ – జనసేన కూటమి మేనిఫెస్టోపై వైసీపీ భయాలివే.!

టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి కూటమి కట్టాక, కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఫొటోతోపాటు పవన్ కళ్యాణ్ ఫొటో…

4 hours ago

OG అభిమానుల్లో అయోమయం

ఎన్నికల వేడి తారాస్థాయిలో ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాల గురించి ఆలోచించడం లేదు కానీ అభిమానులు మాత్రం ఈ…

4 hours ago

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప…

5 hours ago