టాలీవుడ్లో ప్రేక్షకులు ఎంతో ఎగ్జైట్ అయ్యే కాంబినేషన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్లది ఒకటి. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అతడు’ ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. రెండో చిత్రం ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినా ప్రేక్షకుల మనసుల్లో మాత్రం కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ సినిమా రిలీజైన పుష్కరం తర్వాత మళ్లీ ఈ కలయికలో సినిమా వస్తోందని అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు.
ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో కొంచెం ఆలస్యం జరిగింది కానీ.. ఎట్టకేలకు నెల కిందట చిత్రీకరణ మొదలవడంతో అందరూ హ్యాపీగా కనిపించారు. చెప్పినట్లే వచ్చే ఏడాది వేసవిలో సినిమా రిలీజవుతుందని అనుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో.. తొలి షెడ్యూల్ తర్వాత షూటింగ్ ఆగింది. కథ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని.. మళ్లీ వర్క్ జరుగుతోందని.. మార్పులు చేర్పులు ఏవో జరుగుతున్నాయని. గుసగుసలు వినిపించాయి.
ఒక దశలో సినిమా ఆగిపోతుందనే ప్రచారం కూడా జరిగింది. ఐతే తాజా సమాచారం ప్రకారం కొన్ని మార్పులు చేర్పులతో సినిమాను ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకున్నారట. ఇంతకుముందు అనుకున్నట్లు సినిమాలో యాక్షన్ డోస్ తగ్గిస్తున్నారని.. కథలో కూడా కీలక మార్పులు జరిగాయని అంటున్నారు.
కొందరేమో ముందు అనుకున్న కథను పూర్తిగా పక్కన పెట్టేశారని, కొత్త కథతో జర్నీ మొదలుపెట్టనున్నారని.. ఇంతకుముందు తొలి షెడ్యూల్లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ను డస్ట్ బిన్లో పడేశారని కూడా అంటున్నారు. మరోవైపు ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్ను తప్పంచేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ తమన్తో త్రివిక్రమ్కు ఈ మధ్య బాగా సింక్ అవుతుండటం.. ఇద్దరి కలయికలో రెండు సూపర్ హిట్ ఆల్బమ్స్ రావడాన్ని దృష్టిలో ఉంచుకుని సంగీత దర్శకుడిని మార్చే అవకాలు అంతగా కనిపించడం లేదు. డిసెంబరు తొలి వారంలో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
This post was last modified on November 13, 2022 10:27 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…