మామూలుగా ఇండస్ట్రీలోకి ఏ వారసుడు హీరోగా అడుగు పెట్టినా మంచి మాస్ మసాలా సినిమా మీదే దృష్టిపెడతాడు. కానీ బెల్లంకొండ గణేష్ మాత్రం దానికి భిన్నంగా స్వాతిముత్యం అనే కాన్సెప్ట్ బేస్డ్ కామెడీ ఎంటర్టైనర్తో ఎంట్రీ ఇచ్చాడు. తన అన్నయ్య బెల్లంకొండ శ్రీనివాస్ ఆరంభం నుంచి మాస్ మసాలా సినిమాలే చేసిన నేపథ్యంలో గణేష్ మాత్రం దానికి భిన్నంగా అడుగులు వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే తొలి చిత్రం గణేష్కు మిశ్రమ అనుభూతి మిగిల్చింది.
ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆహా ఓటీటీలో చూసి సినిమాను కొనియాడిన వాళ్లంతా సినిమాలో మిగతా ఆర్టిస్టులను పొగిడినట్లు గణేష్ను పొగడలేదు. ఇలాంటి సినిమాతో హీరోగా అరంగేట్రం చేసినందుకు అభినందించారే తప్ప నటన పరంగా అతడికి మంచి మార్కులు వేయలేదు. కట్ చేస్తే ఇప్పుడు గణేష్ రెండో సినిమాతో రెడీ అయిపోయాడు. ‘నేను స్టూడెంట్ సార్’ అనే చిత్రంతో అతను మళ్లీ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
‘నాంది’ సతీశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని రాకీ ఉప్పలపాటి డైరెక్ట్ చేశాడు. ఈ రోజే దీని టీజర్ లాంచ్ అయింది. తొలి సినిమాలాగే ఈసారి కూడా కొంచెం భిన్నమైన సినిమానే ఎంచుకున్నట్లున్నాడు గణేష్. ఇది మొత్తం ఒక ఐఫోన్ చుట్టూ తిరిగే సినిమా కావడం విశేషం. ఎంతో ఇష్టపడి హీరో కొనుక్కున్న ఫోన్ పోతుంది.
దాని మీద కంప్లైంట్ చేయడానికి అతను కమిషనర్ ఆఫీసుకు వస్తాడు. ఫోన్ పోతే పోలీస్ స్టేషన్లో కదా కంప్లైంట్ చేయాల్సింది అంటే.. తన ఫోన్ కొట్టేసిందే పోలీసులు అంటూ షాకిస్తాడు. ఇంతకీ పోలీసులేంటి.. హీరో ఫోన్ కొట్టేయడమేంటి అంటే.. ఇదంతా ఒక ట్రాప్ అయి ఉండొచ్చని అనిపిస్తోంది. టీజర్ వరకు అయితే ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో.. గణేష్కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.
This post was last modified on November 12, 2022 7:35 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…