టాలీవుడ్ యువ కథానాయకుడు ‘అర్జున్ రెడ్డి’ అనే తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. అప్పుడు అతడికి వచ్చిన ఫాలోయింగ్ చూసి సరైన సినిమాలు పడితే పాన్ ఇండియ స్థాయిలో పెద్ద స్టార్ అయిపోతాడని అంచనా వేశారు సినీ పండితులు. కానీ గీత గోవిందం, ట్యాక్సీవాలా సినిమాల వరకు అతడి బండి బాగానే నడిచింది కానీ.. తర్వాత ట్రాక్ తప్పాడు.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లు అతణ్ని వెనక్కి లాగాయి. ఇక ఈ ఏడాది ‘లైగర్’ అడిఎంత పెద్ద షాకిచ్చిందో తెలిసిందే. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తాను అన్నవాడు కాస్తా తనే షేక్ అయిపోయాడు. తెలుగులోనే కనీస స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. ఇతర భాషల్లో మరింత పూర్గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమా విజయ్ కెరీర్ మీద బాగానే నెగెటివ్ ఎఫెక్ట్ చూపించినట్లు కనిపిస్తోంది.
ఐతే ఇలాంటి టైంలో విజయ్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అతను ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్-2లో లీడ్ రోల్ చేయబోతున్నాడట. పార్ట్-1లో శివ కథను చూపించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ రెండో భాగంలో ‘దేవ్’ కథను చూపించనున్న సంగతి తెలిసిందే. పార్ట్-1లోనే పార్ట్-2 గురించి హింట్ ఇచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను ఎవరు చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ పాత్రకు విజయ్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
కానీ ఏ రకంగా చూసినా ఇది నిజం అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. రణబీర్కు తండ్రిగా అతడి కంటే చిన్నవాడు, యంగ్ హీరో అయిన విజయ్ని ఎంచుకుంటారంటే నమ్మలేం. దీనికి తోడు ‘లైగర్’ రిజల్ట్ చూశాక ఇలాంటి భారీ చిత్రానికి అతడిని తీసుకోవడం సాహసమే అవుతుంది. అందులోనూ ‘లైగర్’ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయి కరణ్ జోహార్ గట్టి దెబ్బ తిన్నాడు. ఇలా ఏ యాంగిల్లో చూసినా విజయ్ను ఇంత భారీ చిత్రంలో లీడ్ రోల్ కోసం ఎంచుకోవడం కష్టమే.
This post was last modified on November 11, 2022 1:46 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…