టాలీవుడ్ యువ కథానాయకుడు ‘అర్జున్ రెడ్డి’ అనే తెలుగు సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించాడు. అప్పుడు అతడికి వచ్చిన ఫాలోయింగ్ చూసి సరైన సినిమాలు పడితే పాన్ ఇండియ స్థాయిలో పెద్ద స్టార్ అయిపోతాడని అంచనా వేశారు సినీ పండితులు. కానీ గీత గోవిందం, ట్యాక్సీవాలా సినిమాల వరకు అతడి బండి బాగానే నడిచింది కానీ.. తర్వాత ట్రాక్ తప్పాడు.
డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్లు అతణ్ని వెనక్కి లాగాయి. ఇక ఈ ఏడాది ‘లైగర్’ అడిఎంత పెద్ద షాకిచ్చిందో తెలిసిందే. ఈ సినిమాతో ఇండియాను షేక్ చేస్తాను అన్నవాడు కాస్తా తనే షేక్ అయిపోయాడు. తెలుగులోనే కనీస స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. ఇతర భాషల్లో మరింత పూర్గా పెర్ఫామ్ చేసింది. ఈ సినిమా విజయ్ కెరీర్ మీద బాగానే నెగెటివ్ ఎఫెక్ట్ చూపించినట్లు కనిపిస్తోంది.
ఐతే ఇలాంటి టైంలో విజయ్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. అతను ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్-2లో లీడ్ రోల్ చేయబోతున్నాడట. పార్ట్-1లో శివ కథను చూపించిన దర్శకుడు అయాన్ ముఖర్జీ రెండో భాగంలో ‘దేవ్’ కథను చూపించనున్న సంగతి తెలిసిందే. పార్ట్-1లోనే పార్ట్-2 గురించి హింట్ ఇచ్చారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను ఎవరు చేస్తారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ పాత్రకు విజయ్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది.
కానీ ఏ రకంగా చూసినా ఇది నిజం అయ్యే సంకేతాలు కనిపించడం లేదు. రణబీర్కు తండ్రిగా అతడి కంటే చిన్నవాడు, యంగ్ హీరో అయిన విజయ్ని ఎంచుకుంటారంటే నమ్మలేం. దీనికి తోడు ‘లైగర్’ రిజల్ట్ చూశాక ఇలాంటి భారీ చిత్రానికి అతడిని తీసుకోవడం సాహసమే అవుతుంది. అందులోనూ ‘లైగర్’ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయి కరణ్ జోహార్ గట్టి దెబ్బ తిన్నాడు. ఇలా ఏ యాంగిల్లో చూసినా విజయ్ను ఇంత భారీ చిత్రంలో లీడ్ రోల్ కోసం ఎంచుకోవడం కష్టమే.
This post was last modified on November 11, 2022 1:46 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…