Movie News

నెట్‌ఫ్లిక్స్ ‘కింగ్’ నాగార్జున

అక్కినేని నాగార్జునకు ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర అస్సలు కలిసి రావడం లేదు. క్రమ క్రమంగా ఆయన బాక్సాఫీస్ మీద పూర్తిగా పట్టు కోల్పోతున్నారు. నాగ్ సినిమాలు బాగున్నాయని అన్నా థియేటర్లకు వచ్చి చూసే పరిస్థితి కనిపించడం లేదు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ తర్వాత ఆ స్థాయిలో నాగ్ సినిమా ఏదీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేదు.

గత ఏడాది ‘వైల్డ్ డాగ్’ అనే థ్రిల్లర్ మూవీ మంచి టాక్ తెచ్చుకుని కూడా దారుణమైన వసూళ్లు రాబట్టింది. ఫుల్ రన్లో రూ.4 కోట్ల లోపు షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ఐతే ఈ సినిమా తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైతే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కొన్ని వారాల పాటు సినిమా టాప్‌లో ట్రెండ్ అయింది. వివిధ భాషల వాళ్లు ఆ సినిమాను గొప్పగా ఆదరించారు.

తన కొత్త చిత్రం ‘ది ఘోస్ట్’ ప్రమోషన్ల టైంలో నాగ్ ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కొవిడ్ వల్ల ఆ సినిమా అంతగా ఆడలేదని.. తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుందని అన్నారు. ‘ది ఘోస్ట్’ కచ్చితంగా థియేటర్లలో మంచి ఫలితం అందుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కానీ డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమనిపించింది.

దసరా టైంలో వీకెండ్లోనే సరైన వసూళ్లు రాబట్టలేకపోయిన ‘ది ఘోస్ట్’ తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. కానీ ఈ చిత్రం కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో రిలీజై అదిరే స్పందన తెచ్చుకుంటోంది. హిందీలో మొన్న సినిమా రిలీజైన దగ్గర్నుంచి నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ నాలుగో స్థానంలో ఉంది. ఇది చూసి నాగ్ బాక్సాఫీస్ కింగ్ కాదు.. నెట్ ఫ్లిక్స్ కింగ్ అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. మరి నాగ్ మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు ఇలాంటి స్పందన తెచ్చుకుంటాడో చూడాలి.

This post was last modified on November 11, 2022 11:08 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago