టి20 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ అత్యంత దారుణంగా ఓటమి చెందడం క్రికెట్ అభిమానులు జీరించుకోలేకపోతున్నారు. పోరాడి ఓడితే కొంత ఊరట దక్కేది కానీ అసలు వికెట్టే కోల్పోకుండా ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ చేసిన ఊచకోత కొన్నాళ్ల పాటు పీడకలగా వచ్చేలా ఉంది. ఇది గెలుస్తుందనే ధీమాతోనే ఇవాళ కోట్లాది జనం టీవీలకు అతుక్కుపోయారు. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఏకంగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల కోసం లైవ్ టెలికాస్ట్ పెట్టారు. అంతగా ఇండియన్ టీమ్ లవర్స్ దీని కోసం ఎదురు చూశారన్న మాట. అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటిలా మొత్తంగా బోల్తా కొట్టేసింది.
దీనికి యశోదకు లింక్ ఏంటనే డౌట్ వస్తోంది కదూ. అక్కడికే వద్దాం. ఒకవేళ రోహిత్ సేన కనక గెలిచి ఉంటే ఆదివారం రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాల్సి వచ్చేది. అదే జరిగితే దేశం మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏర్పడి ఎవరూ బయటికి వచ్చే సీన్ ఉండదు. ఇక థియేటర్ల గురించి చెప్పేదేముంది. అలాంటప్పుడు కీలకమైన సండే వసూళ్లకు పెద్ద గండి పడేది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సమంతా యశోదనే. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ మొదలయ్యేది మధ్యాన్నం నుంచి. సాయంత్రానికి పూర్తయినా అప్పటికప్పుడు పబ్లిక్ సినిమాలకు పరుగులు పెట్టరుగా
మొత్తానికి మ్యాచ్ పోవడం బాక్సాఫీస్ కి ఊరటనిస్తోంది. ఎందుకంటే గ్రూప్ మ్యాచులు జరుగుతున్నప్పుడు ఇండియా పాక్ తలపడిన సందర్భంలో కలెక్షన్లు బాగా ప్రభావితం చెందాయి. ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతుందేమో అనుకుంటే ఎట్టకేలకు ఆ గండం అయితే తప్పింది. ఇది ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే అయినా మూవీ కన్నా దేశం పరువు ముఖ్యం కాబట్టి ఓటమి వల్ల కలిగిన బాధ అంత సులభంగా తగ్గేది కాదు. యశోదతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజవుతున్నా వాటికి పెద్ద హైప్ లేదు. ఉన్నంతలో హాలీవుడ్ మూవీ వాకండ ఫరెవర్ కే ఎక్కువ హైప్ ఉంది.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…