టి20 ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఇండియన్ టీమ్ అత్యంత దారుణంగా ఓటమి చెందడం క్రికెట్ అభిమానులు జీరించుకోలేకపోతున్నారు. పోరాడి ఓడితే కొంత ఊరట దక్కేది కానీ అసలు వికెట్టే కోల్పోకుండా ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ చేసిన ఊచకోత కొన్నాళ్ల పాటు పీడకలగా వచ్చేలా ఉంది. ఇది గెలుస్తుందనే ధీమాతోనే ఇవాళ కోట్లాది జనం టీవీలకు అతుక్కుపోయారు. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఏకంగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఉద్యోగుల కోసం లైవ్ టెలికాస్ట్ పెట్టారు. అంతగా ఇండియన్ టీమ్ లవర్స్ దీని కోసం ఎదురు చూశారన్న మాట. అనుకున్నది ఒక్కటి అయినది ఇంకొక్కటిలా మొత్తంగా బోల్తా కొట్టేసింది.
దీనికి యశోదకు లింక్ ఏంటనే డౌట్ వస్తోంది కదూ. అక్కడికే వద్దాం. ఒకవేళ రోహిత్ సేన కనక గెలిచి ఉంటే ఆదివారం రోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడాల్సి వచ్చేది. అదే జరిగితే దేశం మొత్తం కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏర్పడి ఎవరూ బయటికి వచ్చే సీన్ ఉండదు. ఇక థియేటర్ల గురించి చెప్పేదేముంది. అలాంటప్పుడు కీలకమైన సండే వసూళ్లకు పెద్ద గండి పడేది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది సమంతా యశోదనే. ఎందుకంటే ఆ రోజు మ్యాచ్ మొదలయ్యేది మధ్యాన్నం నుంచి. సాయంత్రానికి పూర్తయినా అప్పటికప్పుడు పబ్లిక్ సినిమాలకు పరుగులు పెట్టరుగా
మొత్తానికి మ్యాచ్ పోవడం బాక్సాఫీస్ కి ఊరటనిస్తోంది. ఎందుకంటే గ్రూప్ మ్యాచులు జరుగుతున్నప్పుడు ఇండియా పాక్ తలపడిన సందర్భంలో కలెక్షన్లు బాగా ప్రభావితం చెందాయి. ఇప్పుడదే సీన్ రిపీట్ అవుతుందేమో అనుకుంటే ఎట్టకేలకు ఆ గండం అయితే తప్పింది. ఇది ఒకరకంగా సంతోషించాల్సిన విషయమే అయినా మూవీ కన్నా దేశం పరువు ముఖ్యం కాబట్టి ఓటమి వల్ల కలిగిన బాధ అంత సులభంగా తగ్గేది కాదు. యశోదతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజవుతున్నా వాటికి పెద్ద హైప్ లేదు. ఉన్నంతలో హాలీవుడ్ మూవీ వాకండ ఫరెవర్ కే ఎక్కువ హైప్ ఉంది.
This post was last modified on November 10, 2022 9:51 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…