వివాదాల మీద సినిమాలు తీస్తే లాభపడతామనో లేక మనోభావాలతో ముడిపడిన అంశాలను తీసుకుంటే త్వరగా ఆడియన్స్ ని ఆకర్షిస్తామనే లెక్కనో ఏమో కానీ ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇలాంటివి మరిన్ని రావడానికి స్ఫూర్తినిస్తోంది. కాశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు డాక్యుమెంటరీ తరహాలో ఉన్నా సరే ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయి ఏకంగా మూడవ వందల కోట్ల వసూళ్లు గుప్పించింది. అందులో చాలా అవాస్తవాలు చూపించారనే కామెంట్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వ అండదండలతో నిర్విరామంగా కొనసాగింది.
ఇప్పుడీ వరసలో మరో మూవీ రానుంది. అదే ది కేరళ స్టోరీ. వారం క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. ముందుగా దీని గురించి ఎవరికీ తెలియదు, పట్టించుకోలేదు. కానీ చాలా సున్నితమైన అంశాలను ఆ చిత్రంలో సృశించారనే టాక్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది కాంట్రావర్సీకి బిందువుగా మారుతోంది. దర్శకులు శ్రీ సుదీప్తో సేన్ ఆ వీడియో ద్వారా కేరళ రాష్ట్రంలో 32 వేల మహిళలు మతం మార్చబడి ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠా చేరేలా ప్రేరేపింపబడ్డారని చూపించారు. సిరియా యెమెన్ ఎడారుల్లో వీళ్లందరినీ సజీవంగా దహనం చేశారని కూడా ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు.
నిజానికి టీజర్ లో బుర్ఖా వేసుకున్న ఒక అమ్మాయి మాట్లాడ్డం తప్ప ఏమి లేదు. కాకపోతే కేరళలో పరిస్థితి చాలా దారుణంగా ఉందనేలా చెప్పించిన తీరు ఇప్పుడీ రచ్చకు కారణమవుతోంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు దీన్ని నిషేదించాలని బిజెపికి లేఖలు రాస్తున్నారు. గాడ్స్ ఓన్ ల్యాండ్ గా పేరున్న కేరళ పేరుని చెడగొట్టేందుకే పూనుకున్నారని ప్రజా మద్దతు కూడగడుతున్నారు. విపుల్ అమృత్ లాల్ షా లాంటి సీనియర్ నిర్మాత కం డైరెక్టర్ ఈ ప్రాజెక్టు వెనుక ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి కాశ్మీర్ ఫైల్స్ లాగా ఇది బయటికి వస్తుందా లేక ఆగిపోతుందా వేచి చూడాలి.
This post was last modified on November 10, 2022 9:52 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…