వివాదాల మీద సినిమాలు తీస్తే లాభపడతామనో లేక మనోభావాలతో ముడిపడిన అంశాలను తీసుకుంటే త్వరగా ఆడియన్స్ ని ఆకర్షిస్తామనే లెక్కనో ఏమో కానీ ది కాశ్మీర్ ఫైల్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇలాంటివి మరిన్ని రావడానికి స్ఫూర్తినిస్తోంది. కాశ్మీర్ లోయలో పండిట్ల ఊచకోత గురించి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి చూపించిన తీరు డాక్యుమెంటరీ తరహాలో ఉన్నా సరే ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయి ఏకంగా మూడవ వందల కోట్ల వసూళ్లు గుప్పించింది. అందులో చాలా అవాస్తవాలు చూపించారనే కామెంట్స్ వచ్చినప్పటికీ ప్రభుత్వ అండదండలతో నిర్విరామంగా కొనసాగింది.
ఇప్పుడీ వరసలో మరో మూవీ రానుంది. అదే ది కేరళ స్టోరీ. వారం క్రితమే టీజర్ రిలీజ్ చేశారు. ముందుగా దీని గురించి ఎవరికీ తెలియదు, పట్టించుకోలేదు. కానీ చాలా సున్నితమైన అంశాలను ఆ చిత్రంలో సృశించారనే టాక్ బయటికి రావడంతో ఒక్కసారిగా ఇది కాంట్రావర్సీకి బిందువుగా మారుతోంది. దర్శకులు శ్రీ సుదీప్తో సేన్ ఆ వీడియో ద్వారా కేరళ రాష్ట్రంలో 32 వేల మహిళలు మతం మార్చబడి ఐఎస్ఐఎస్ తీవ్రవాద ముఠా చేరేలా ప్రేరేపింపబడ్డారని చూపించారు. సిరియా యెమెన్ ఎడారుల్లో వీళ్లందరినీ సజీవంగా దహనం చేశారని కూడా ఒక లేడీ క్యారెక్టర్ ద్వారా చెప్పించారు.
నిజానికి టీజర్ లో బుర్ఖా వేసుకున్న ఒక అమ్మాయి మాట్లాడ్డం తప్ప ఏమి లేదు. కాకపోతే కేరళలో పరిస్థితి చాలా దారుణంగా ఉందనేలా చెప్పించిన తీరు ఇప్పుడీ రచ్చకు కారణమవుతోంది. దీంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు దీన్ని నిషేదించాలని బిజెపికి లేఖలు రాస్తున్నారు. గాడ్స్ ఓన్ ల్యాండ్ గా పేరున్న కేరళ పేరుని చెడగొట్టేందుకే పూనుకున్నారని ప్రజా మద్దతు కూడగడుతున్నారు. విపుల్ అమృత్ లాల్ షా లాంటి సీనియర్ నిర్మాత కం డైరెక్టర్ ఈ ప్రాజెక్టు వెనుక ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి కాశ్మీర్ ఫైల్స్ లాగా ఇది బయటికి వస్తుందా లేక ఆగిపోతుందా వేచి చూడాలి.
This post was last modified on November 10, 2022 9:52 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…