లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. తనదైన శైలిలో దర్శకత్వం అండ్ రైటింగ్ తో ఇంప్రెస్ చేస్తున్న కమెడియన్ అవసరాల శ్రీనివాస్.. ఇప్పుడు అలనాటి ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెరకెక్కించబోతున్నాడట. మెయిన్ లీడ్గా తనే గిరీశం పాత్రంలో మెరవబోతున్నడని వినిపిస్తోంది. అయితే గురజాడ అప్పారవ్ రాసిన ఈ నాటకాన్ని ఎంతమంది సినిమాలుగా తీస్తారంటూ ఇప్పుడు ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ముందుగా కన్యాశుల్కం గురించి మాట్లాడుకుంటే.. ముసలోడికి చిన్నపిల్లలను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిచేయడం అనే కాన్సెప్ట్పై రాసిన ఈ నాటకం.. ఇప్పటి పరిస్థితులకు అస్సలు సెట్టవ్వదు. కొత్తగా మార్చి తీస్తే ఆడదు. 1892 నాటి సెటప్ లో తీయాలంటే భారీ బడ్జెట్ అవుతుంది. అదీ కాకుండా.. ఈ నాటకంలో చాలాపాత్రలు బ్రాహ్మణులే. బ్రాహ్మిణ్ క్యాస్ట్ మీద గురజాడ వేసిన సెటైరే ఈ నాటకంలో మెయిన్ హ్యూమర్ ఎలిమెంట్. పైగా మెయిన్ హీరోయిన్ మధురవాణి ఒక వేశ్య. ఆమె ద్వారా హీరో జీవితపరమార్ధం గ్రహించి.. చివరకు ఒకమ్మాయిని పెళ్ళిచేసుకుంటాడు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా క్యాస్ట్ తరహా ప్రాజెక్టులు చేస్తే.. దానికి నిరసన సెగలు ఏ రేంజులో తగులుతున్నాయో తెలిసిందే. అలాగే ప్రాస్టిట్యూట్ అంటూ చూపించాలన్నా కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
ఇదంతా ఒకెత్తయితే, ఆల్రెడీ కన్యాశుల్కం ను వెబ్సిరీస్గా తీయడానికి దర్శకుడు క్రిష్ ఎప్పుడో రంగం సిద్దంచేసుకున్నాడు. ఒక ప్రముఖ ఓటిటి ఫ్లాట్ఫామ్కు తీసేయాలని చాలా ప్రయత్నించాడు. రైటింగ్, క్యాస్టింగ్ అన్నీ అయిపోయాయి. కొన్నిరోజులు షూటింగ్ కూడా జరిగింది. కాని ఎందుకో తరువాత ఈ సిరీస్ గురించి ఎటువంటి న్యూస్ లేనేలేదు. ఈ టైములో శ్రీనివాస్ అవసరాల మళ్ళీ కన్యాశుల్కం అంటే అంత కిక్ మాత్రం రావట్లేదు.
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…