బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమాల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. కొన్ని నెలల కిందటే ‘కేజీఎఫ్-2’ ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. డివైడ్ టాక్ను కూడా తట్టుకుని ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసిందా చిత్రం. ఆ తర్వాత కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’ సైతం పలు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నెల రోజులుగా ‘కాంతార’ అనే సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.
ఈ సినిమాకు సంబంధించి ఎవ్వరూ కూడా ఇతర భాషల వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఈ కథాంశం కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నేటివిటీతో ముడిపడ్డది అయినా.. ఈ సినిమా అన్ని భాషల వాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్ వసూళ్లు దాదాపు రూ.60 కోట్ల దాకా ఉండగా.. హిందీ వెర్షన్ అంతకంటే ఎక్కువే రాబట్టింది.
కన్నడలో రిలీజై ఐదు వారాలు దాటినా.. తెలుగు, హిందీ భాషల్లో నాలుగు వారాలు అవుతున్నా ‘కాంతార’ జోరేమీ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని మైలురాయిని అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకోవడమే కాక.. ‘పుష్ప’ సినిమా కలెక్షన్లను అధిగమించింది.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో నటించాడు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఆ సినిమా తీశాడు. తెలుగులో ఆ చిత్రానికి ఉన్న హైప్ గురించి తెలిసిందే. హిందీలో ఆ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది. ఇతర భాషల్లోనూ పర్వాలేదనిపించింది. దీంతో వరల్డ్ వైడ్ రూ.350 కోట్లకు చేరువగా వెళ్లింది. ఐతే ‘కాంతార’ లాంటి చిన్న సినిమా ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాన్ని అధిగమించడం చిన్న విషయం కాదు. ఇది ఎవ్వరి ఊహకూ అందని విషయం. ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.400 కోట్ల గ్రాస్ మార్కును కూడా సులువుగానే దాటేసేలా కనిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…