బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమాల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. కొన్ని నెలల కిందటే ‘కేజీఎఫ్-2’ ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. డివైడ్ టాక్ను కూడా తట్టుకుని ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసిందా చిత్రం. ఆ తర్వాత కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’ సైతం పలు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నెల రోజులుగా ‘కాంతార’ అనే సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.
ఈ సినిమాకు సంబంధించి ఎవ్వరూ కూడా ఇతర భాషల వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఈ కథాంశం కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నేటివిటీతో ముడిపడ్డది అయినా.. ఈ సినిమా అన్ని భాషల వాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్ వసూళ్లు దాదాపు రూ.60 కోట్ల దాకా ఉండగా.. హిందీ వెర్షన్ అంతకంటే ఎక్కువే రాబట్టింది.
కన్నడలో రిలీజై ఐదు వారాలు దాటినా.. తెలుగు, హిందీ భాషల్లో నాలుగు వారాలు అవుతున్నా ‘కాంతార’ జోరేమీ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని మైలురాయిని అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకోవడమే కాక.. ‘పుష్ప’ సినిమా కలెక్షన్లను అధిగమించింది.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో నటించాడు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఆ సినిమా తీశాడు. తెలుగులో ఆ చిత్రానికి ఉన్న హైప్ గురించి తెలిసిందే. హిందీలో ఆ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది. ఇతర భాషల్లోనూ పర్వాలేదనిపించింది. దీంతో వరల్డ్ వైడ్ రూ.350 కోట్లకు చేరువగా వెళ్లింది. ఐతే ‘కాంతార’ లాంటి చిన్న సినిమా ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాన్ని అధిగమించడం చిన్న విషయం కాదు. ఇది ఎవ్వరి ఊహకూ అందని విషయం. ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.400 కోట్ల గ్రాస్ మార్కును కూడా సులువుగానే దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on November 10, 2022 3:39 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…