బాక్సాఫీస్ దగ్గర కన్నడ సినిమాల డ్రీమ్ రన్ కొనసాగుతోంది. కొన్ని నెలల కిందటే ‘కేజీఎఫ్-2’ ఎలా వసూళ్ల మోత మోగించిందో తెలిసిందే. డివైడ్ టాక్ను కూడా తట్టుకుని ఏకంగా రూ.1200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసిందా చిత్రం. ఆ తర్వాత కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’ సైతం పలు భాషల్లో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు నెల రోజులుగా ‘కాంతార’ అనే సినిమా రేపుతున్న సంచలనం అంతా ఇంతా కాదు.
ఈ సినిమాకు సంబంధించి ఎవ్వరూ కూడా ఇతర భాషల వాళ్లకు పెద్దగా పరిచయం లేకపోయినా.. ఈ కథాంశం కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నేటివిటీతో ముడిపడ్డది అయినా.. ఈ సినిమా అన్ని భాషల వాళ్లకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. తెలుగు వెర్షన్ వసూళ్లు దాదాపు రూ.60 కోట్ల దాకా ఉండగా.. హిందీ వెర్షన్ అంతకంటే ఎక్కువే రాబట్టింది.
కన్నడలో రిలీజై ఐదు వారాలు దాటినా.. తెలుగు, హిందీ భాషల్లో నాలుగు వారాలు అవుతున్నా ‘కాంతార’ జోరేమీ తగ్గలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని మైలురాయిని అందుకుంది. రూ.350 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని అందుకోవడమే కాక.. ‘పుష్ప’ సినిమా కలెక్షన్లను అధిగమించింది.
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరో నటించాడు. సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ఆ సినిమా తీశాడు. తెలుగులో ఆ చిత్రానికి ఉన్న హైప్ గురించి తెలిసిందే. హిందీలో ఆ చిత్రానికి ఊహించని స్పందన వచ్చింది. ఇతర భాషల్లోనూ పర్వాలేదనిపించింది. దీంతో వరల్డ్ వైడ్ రూ.350 కోట్లకు చేరువగా వెళ్లింది. ఐతే ‘కాంతార’ లాంటి చిన్న సినిమా ‘పుష్ప’ లాంటి భారీ చిత్రాన్ని అధిగమించడం చిన్న విషయం కాదు. ఇది ఎవ్వరి ఊహకూ అందని విషయం. ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.400 కోట్ల గ్రాస్ మార్కును కూడా సులువుగానే దాటేసేలా కనిపిస్తోంది.
This post was last modified on November 10, 2022 3:39 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…