టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. అప్పుడప్పుడూ బయటి వాళ్లు చిన్న సినిమాలు నచ్చి తన బేనర్ మీద రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ చిన్న చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమా పేరు.. మసూద. ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన తిరువీర్ ఇందులో హీరోగా నటించగా.. ‘ఖడ్గం’ సహా చాలా సినిమాలతో ఆకట్టుకున్న సీనియర్ నటి సంగీత ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించింది.
‘గంగోత్రి’లో బాల నటిగా ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్ర చేసింది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్ను కొన్ని రోజుల కిందటే నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ పరంగా రిచ్గానే కనిపించి ‘మసూద’. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది.
ఇది నజియా అనే ఓ ముస్లిం అమ్మాయి చుట్టూ తిరిగే కథ. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. దయ్యాన్ని చూశానని చెప్పి తాను భయపడడమే కాక అందరినీ భయపెట్టడం.. తనను మామూలు మనిషిని చేయడానికి తన వాళ్లు పడే తాపత్రయం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సంగీత ఇందులో సైన్స్ టీచర్ పాత్ర పోషించింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 18న ‘మసూదను’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజుతో పాటు ‘మసూద’ టీం అంతా పాల్గొంది.
రాహుల్ యాదవ్ నిర్మించిన తొలి రెండు చిత్రాలకు తాను అభిమానినని.. అతను తీసే మూడో సినిమాను తాను రిలీజ్ చేస్తానని ముందే మాట ఇచ్చానని, ఆ ప్రకారమే మసూద మూవీతో అసోసియేట్ అయ్యానని రాజు తెలిపాడు. ఇంకా మసూద సినిమా చూడకముందే రాజు దీన్ని తన బేనర్ మీద రిలీజ్ చేయడానికి డిసైడయ్యాడట. టీజర్ చాలా బాగుందని, త్వరలోనే సినిమా చూడబోతున్నానని రాజు తెలిపాడు.
This post was last modified on November 9, 2022 8:58 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…