టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. అప్పుడప్పుడూ బయటి వాళ్లు చిన్న సినిమాలు నచ్చి తన బేనర్ మీద రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ కోవలోనే ఓ చిన్న చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు దిల్ రాజు. ఆ సినిమా పేరు.. మసూద. ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన తిరువీర్ ఇందులో హీరోగా నటించగా.. ‘ఖడ్గం’ సహా చాలా సినిమాలతో ఆకట్టుకున్న సీనియర్ నటి సంగీత ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించింది.
‘గంగోత్రి’లో బాల నటిగా ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్ర చేసింది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్ను కొన్ని రోజుల కిందటే నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు. బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ పరంగా రిచ్గానే కనిపించి ‘మసూద’. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది.
ఇది నజియా అనే ఓ ముస్లిం అమ్మాయి చుట్టూ తిరిగే కథ. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. దయ్యాన్ని చూశానని చెప్పి తాను భయపడడమే కాక అందరినీ భయపెట్టడం.. తనను మామూలు మనిషిని చేయడానికి తన వాళ్లు పడే తాపత్రయం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సంగీత ఇందులో సైన్స్ టీచర్ పాత్ర పోషించింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి చిత్రాలతో అభిరుచిని చాటుకున్న రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ నెల 18న ‘మసూదను’ రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్లో దిల్ రాజుతో పాటు ‘మసూద’ టీం అంతా పాల్గొంది.
రాహుల్ యాదవ్ నిర్మించిన తొలి రెండు చిత్రాలకు తాను అభిమానినని.. అతను తీసే మూడో సినిమాను తాను రిలీజ్ చేస్తానని ముందే మాట ఇచ్చానని, ఆ ప్రకారమే మసూద మూవీతో అసోసియేట్ అయ్యానని రాజు తెలిపాడు. ఇంకా మసూద సినిమా చూడకముందే రాజు దీన్ని తన బేనర్ మీద రిలీజ్ చేయడానికి డిసైడయ్యాడట. టీజర్ చాలా బాగుందని, త్వరలోనే సినిమా చూడబోతున్నానని రాజు తెలిపాడు.
This post was last modified on November 9, 2022 8:58 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…