రంగమార్తాండ.. ఒకప్పటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన కృష్ణవంశీ నుంచి రాబోతున్న కొత్త చిత్రం. ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు తీస్తూ.. తరచుగా ఘనవిజయాలు అందుకున్న కృష్ణవంశీ గత దశాబ్ద కాలంలో బాగా డల్లయిపోయాడు. చందమామ తర్వాత ఆయన్నుంచి హిట్టే రాలేదు. మొగుడు, నక్షత్రం లాంటి డిజాస్టర్లు ఆయన స్థాయిని బాగా తగ్గించేశాయి.
నక్షత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆయన రంగమార్తాండ సినిమా చేస్తున్నారు. ఐతే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసి చాలా కాలం అయింది. కానీ ఎంతకీ పూర్తవడం లేదు. ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఐతే ఇటీవలే ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి వాళ్లు ఈ సినిమా కోసం డబ్బింగ్ చెబుతున్న ఫొటోలు బయటికి వచ్చాయి.
అంటే త్వరలోనే సినిమా థియేటర్లలోకి దిగే అవకాశం ఉందన్నమాట. ఈ దిశగా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ‘రంగమార్తాండ’ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. మరాఠీ హిట్ ‘నటసామ్రాట్’కు రీమేక్గా తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ సినిమాను ముందు తనే డైరెక్ట్ చేయాలనుకున్నానని.. కానీ ఈ సినిమా తీయడానికి తన మిత్రుడైన కృష్ణవంశీనే సరైన వాడని భావించి అతడికి చేతికి ఈ సినిమాను అప్పగించానని ప్రకాష్ రాజ్ తెలిపాడు.
‘రంగమార్తాండ’ తన కెరీర్లోనే ది బెస్ట్ ఫిలింగా నిలుస్తుందని.. ఇప్పటిదాకా చూడని కొత్త ప్రకాష్ రాజ్ను ఈ సినిమాలో చూస్తారని ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రకాష్ రాజ్ ఇంతగా చెబుతున్నాడంటే ఆయన పాత్ర ప్రత్యేకంగానే ఉంటుందని ఆశించవచ్చు. ఒరిజినల్లో లెజెండరీ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చేసిన పాత్రనే ఇక్కడ ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు.
This post was last modified on November 8, 2022 8:53 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…