గత వారం ఏకంగా పది సినిమాల దాకా రిలీజయ్యాయి. వాటిలో ఒక్క ‘ఊర్వశివో రాక్షసివో’ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి మాత్రమే చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. మిగతా సినిమాలు కనీస ప్రభావం చూపలేకపోయాయి. వీకెండ్ అయ్యాక ‘ఊర్వశివో రాక్షసివో’ కూడా డల్లయింది. ఇక ప్రేక్షకుల ఫోకస్ తర్వాతి వీకెండ్ మీదికి మళ్లింది.
ఈ శుక్రవారం సమంత సినిమా ‘యశోద’ రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే సమంత అనారోగ్యం వల్ల విడుదలకు ముందు అనుకున్న ప్రమోషనల్ ప్లాన్లు చెల్లాచెదురయ్యాయి. సామ్ అనారోగ్యంతోనూ ఒక వీడియో ఇంటర్వ్యూ చేసి మీడియాకు విడుదల చేసింది. ప్రమోషన్లు తక్కువ కావడం మైనస్ కాగా.. సామ్ అనారోగ్యం తాలూకు సింపతీ సినిమాకు ప్లస్ కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైతేనేం బాక్సాఫీస్ డల్లుగా నడుస్తున్న టైంలో రిలీజవుతున్న ‘యశోద’ సామ్ బాక్సాఫీస్ సత్తాకు పరీక్షగా నిలవబోతోందన్నది స్పష్టం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అన్ని భాషల్లో కలిపి వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.23-24 కోట్ల మేర బిజినెస్ చేసింది.
విషయం ఉన్న సినిమాలా కనిపిస్తున్నప్పటికీ.. ‘యశోద’కు ఓపెనింగ్స్ తీసుకురావాల్సింది మాత్రం సమంతనే. ఆమె పేరు మీదే సినిమాకు బిజినెస్ జరిగింది. రేప్పొద్దున అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆమె ఆకర్షణ మీదే ఆధారపడి ఉంటాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీతో రూ.40 కోట్ల గ్రాస్, రూ.24 కోట్ల షేర్ రాబట్టడం.. అది కూడా నవంబరులో అంటే అంత తేలికైన విషయం కాదు. మరి సమంత బాక్సాఫీస్ తన సత్తాను ఏమేర చూపిస్తుందో.. ‘యశోద’ను ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి.
This post was last modified on November 8, 2022 8:49 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…