బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి స్థానం షోలే అయితే రెండోది హం ఆప్కే హై కౌన్. మూడున్నర గంటల లెన్త్ తో సగం నిడివి కేవలం పాటలతో నడిచే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేటర్లో చూసేందుకు జనం తండోపతండాలుగా ఎగబడిపోయేవారు. దీని దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్య అంతకు ముందు తీసిన మైనే ప్యార్ కియా సైతం ఒక ల్యాండ్ మార్క్ మూవీనే. సల్మాన్ ఖాన్ ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ డంకు బలమైన పునాది వేసింది ఈ రెండే. రాజశ్రీ బ్యానర్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం కూడా సూరజే.
అంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ మూవీ అందులోనూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేసిందంటే ఎలాంటి అంచనాలు ఉండాలి. కానీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఊంచాయి విషయంలో అసలెలాంటి సౌండ్ వినిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. చనిపోయిన స్నేహితుడి చివరి కోరిక తీర్చడం కోసం వయసు మళ్ళిన వృద్ధుల బ్యాచ్ సాహసోపేతమైన హిమాలయ పర్వతాల మీద ట్రెక్కింగ్ చేయడమనే పాయింట్ తో ఇది రూపొందింది. మొత్తం ముసలి బ్యాచే ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
అసలే స్లంప్ లో ఉన్న బాలీవుడ్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర, భూల్ భూలయ్యా 2 తర్వాత చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేదు. పట్టుమని పాతిక కోట్లు తేలేక అన్నీ తోక ముగుస్తున్నాయి. అమితాబ్ కు సైతం టైం కలిసి రావడం లేదు. ఆ మధ్య రష్మిక మందన్నతో చేసిన గుడ్ బైని మరీ దారుణంగా చాప చుట్టేసింది. ఇప్పుడీ ఊంచాయి మీద జీరో బజ్ నడుస్తోంది. టాక్ ఏమైనా పాజిటివ్ గా వస్తే తప్ప ఇంకేం ఆశించలేం. దీని తర్వాత సూరజ్ మరోసారి సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నారు.
This post was last modified on November 8, 2022 6:00 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…