బాలీవుడ్ చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకోదగ్గ సినిమాల్లో మొదటి స్థానం షోలే అయితే రెండోది హం ఆప్కే హై కౌన్. మూడున్నర గంటల లెన్త్ తో సగం నిడివి కేవలం పాటలతో నడిచే ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ థియేటర్లో చూసేందుకు జనం తండోపతండాలుగా ఎగబడిపోయేవారు. దీని దర్శకుడు సూరజ్ ఆర్ బరజాత్య అంతకు ముందు తీసిన మైనే ప్యార్ కియా సైతం ఒక ల్యాండ్ మార్క్ మూవీనే. సల్మాన్ ఖాన్ ఇప్పుడు అనుభవిస్తున్న స్టార్ డంకు బలమైన పునాది వేసింది ఈ రెండే. రాజశ్రీ బ్యానర్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం కూడా సూరజే.
అంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న డైరెక్టర్ మూవీ అందులోనూ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో చేసిందంటే ఎలాంటి అంచనాలు ఉండాలి. కానీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఊంచాయి విషయంలో అసలెలాంటి సౌండ్ వినిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉన్నాయి. చనిపోయిన స్నేహితుడి చివరి కోరిక తీర్చడం కోసం వయసు మళ్ళిన వృద్ధుల బ్యాచ్ సాహసోపేతమైన హిమాలయ పర్వతాల మీద ట్రెక్కింగ్ చేయడమనే పాయింట్ తో ఇది రూపొందింది. మొత్తం ముసలి బ్యాచే ఉండటంతో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది.
అసలే స్లంప్ లో ఉన్న బాలీవుడ్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ది కాశ్మీర్ ఫైల్స్, బ్రహ్మాస్త్ర, భూల్ భూలయ్యా 2 తర్వాత చెప్పుకోదగ్గ హిట్టు ఒక్కటీ లేదు. పట్టుమని పాతిక కోట్లు తేలేక అన్నీ తోక ముగుస్తున్నాయి. అమితాబ్ కు సైతం టైం కలిసి రావడం లేదు. ఆ మధ్య రష్మిక మందన్నతో చేసిన గుడ్ బైని మరీ దారుణంగా చాప చుట్టేసింది. ఇప్పుడీ ఊంచాయి మీద జీరో బజ్ నడుస్తోంది. టాక్ ఏమైనా పాజిటివ్ గా వస్తే తప్ప ఇంకేం ఆశించలేం. దీని తర్వాత సూరజ్ మరోసారి సల్మాన్ ఖాన్ తో చేయబోతున్నారు.
This post was last modified on November 8, 2022 6:00 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…