చిన్నప్పుడు ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవిగా మెప్పించిన తేజ సజ్జా.. పెద్దయ్యాక హీరో అయిపోయి చాలా సినిమాలే చేశాడు. కాని ఇంకా రావల్సినంత బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఈసారి మనోడు ఒక సూపర్ హీరో కాన్సెప్టుతో వస్తున్నాడు. తనతో ఆల్రెడీ జాంబీ రెడ్డి సినిమాను తీసిన ప్రశాంత్ వర్మ డైరక్షన్లో ఇప్పుడు ‘హను మ్యాన్’ అంటూ ఒక సినిమాతో అలరించబోతున్నాడు. కాని ఈ సినిమా కాన్సెప్టే ఇప్పుడు అన్నింటికంటే చాలా డేంజరస్ థింగ్. ఎందుకంటారా?
వెబ్లోకి టీజర్ ట్రైలర్ వచ్చీ రాగానే విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ గురించి మూవీ లవ్వర్స్ చేస్తున్న కామెంట్స్ ఎలా ఉంటున్నాయో తెలిసిందే. మరి సూపర్ హీరో సినిమా అంటూ ఇప్పుడు కుర్ర హీరో తేజ సజ్జాను ఒక పవర్ఫుల్ హను-మ్యాన్ అంటూ చూపిస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఖచ్చితంగా గ్రాఫిక్స్ పరంగా చాలా టాప్ క్వాలిటీ వర్క్తోనే బయటకు రావాలి. ఈ మధ్యన వచ్చిన ఆదిపురుష్ టీజర్ చుట్టూ ఎలాంటి నెగెటివ్ కామెంట్లు వినిపించాయో తెలిసిందేగా. పైగా ఇప్పటికే ఈ సినిమాను పలుమార్లు పోస్ట్పోన్ చేస్తుంటే, ఖచ్చితంగా గ్రాఫక్స్కు సంబంధించి ఏదో ఫైన్ ట్యూన్ చేస్తున్నారని కూడా టాక్ వస్తోంది. అందులోనే ట్రైలర్లోనే గ్రాఫిక్స్ షాట్స్ పెడితే మాత్రం.. వాటివరకు విపరీతమైన క్వాలిటీ ఉండాల్సిందే.
నిజానికి బింబిసారా సినిమా వచ్చినప్పుడు.. కాన్సెప్టు కొత్తగా ఉండటంతో వీక్ గ్రాఫిక్స్ మీద ఎవ్వరూ కామెంట్ చెయ్యలేదు. కాని సూపర్ హీరో సినిమాలకు మాత్రం.. ఆల్రెడీ మనోళ్ళు రెగ్యులర్గా హాలీవుడ్ సినిమాలను వెండితెరపై చూస్తూనే ఉంటారు కాబట్టి.. ఖచ్చితంగా అదే రేంజు క్వాలిటి కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక టీజర్ వస్తనే ఈ సినిమా తాలూకు అసలు కలర్ ఏంటనేది బయటపడుతుంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…