Movie News

శివరాత్రిని సంక్రాంతి చేసేలా ఉన్నారు

టాలీవుడ్ కొత్త రిలీజులకు డేట్ సెట్ చేసుకోవడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. మనం ప్రకటించినంత మాత్రాన తాపీగా ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎవరు ఏ అనౌన్స్ మెంట్ ఇస్తారో ఎవరితో క్లాష్ అవ్వాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ ఎదురు చూడాల్సి వస్తోంది. అందుకే ఏదైనా పండగ వచ్చినా ఏదైనా వరస సెలవులు కనిపిస్తున్నా వెంటనే కర్చీఫ్ వేసేందుకు పరుగులు పెడుతున్నారు. మాములుగా నాలుగైదు సినిమాలు పోటీ పడేందుకు మనకు అనుకూలమైన పండగలు మూడే. అవి సంక్రాంతి, దసరా, దీపావళి. ఇప్పుడీ లిస్టులో శివరాత్రి కూడా తోడవ్వబోతోంది.

ఇంకా మూడు నెలల సమయం ఉండగానే ఫిబ్రవరి స్లాట్ లను వేగంగా రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాటిలో ముందు లాక్ చేసుకున్నది కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. 17న రాబోతున్నట్టు ఆ మధ్య ప్రకటించారు నిన్న ధనుష్ ‘సర్’ని అదే డేట్ కి థియేటర్లలో రిలీజ్ చేస్తామని సితార సంస్థ పోస్టర్ వదిలింది. ఒకటేమో గీతా ఆర్ట్స్ మరొకటేమో సితార ఎంటర్ టైన్మెంట్స్. రెండూ పెద్ద బ్యానర్లే. జనవరి నుంచి ‘ఏజెంట్’ తప్పుకోవడం దాదాపు కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు తన చూపు కూడా శివయ్య జాగారం మీదే పడుతోంది. ఆల్మోస్ట్ ఓకే అవ్వొచ్చని అంటున్నారు.

వీటికి వారం ముందు ఫిబ్రవరి 10న కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఉంటుంది. మాస్ ఆడియన్స్ అర్థం కానీ ఇంగ్లీష్ టైటిల్ తో నందమూరి హీరో ఏకంగా త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ఇప్పటికే లీక్ వచ్చేసింది. సినిమా బాగుంటే సెకండ్ వీక్ కూడా స్ట్రాంగ్ రన్ ఉంటుంది. సో పోటీ మాములుగా ఉండదు. ఇవి చాలదన్నట్టు హాలీవుడ్ మూవీ ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ ఖ్వన్టమేనియా’ కూడా 17నే వస్తుంది. సమంతా కనక త్వరగా కోలుకుంటే ‘శాకుంతలం’ని సైతం ఇదే బరిలో దించేందుకు దర్శక నిర్మాత గుణశేఖర్ ప్లానింగ్ లో ఉన్నారు. చివరికి రేస్ లో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో చూడాలి.

This post was last modified on November 8, 2022 9:00 am

Share
Show comments

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

4 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago