మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏడాదిన్నరగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమై ఉన్నాడు. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండాలి. ఈ నెలలోనే ఆ సినిమా విడుదలై ఉండాలి. కానీ ఎప్పట్లాగే రాజమౌళి ఆలస్యం చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే సంక్రాంతికి వాయిదా వేయించాడు. కానీ కరోనా పుణ్యమా అని ఆ డేట్ కూడా అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ సినిమాలో తన పని పూర్తి చేసి చరణ్ ఎఫ్పటికీ ఫ్రీ అవుతాడో చెప్పలేని పరిస్థితి.
ఐతే ఇప్పటికే ‘రంగస్థలం’తో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. అప్పుడు చరణ్తో సినిమా చేసే అవకాశం దక్కితే అది బంపరాఫరే. ఆ ఆఫర్ను దక్కించుకోవడానికి చాలామంది దర్శకులే లైన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కనీసం అరడజను కాంబినేషన్లు అయినా వినిపించి ఉంటాయి. ముందు ‘ఆచార్య’ చేస్తున్న కొరటాల శివతో సినిమా ఉంటుందన్నారు. తర్వాత సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కావచ్చన్నారు. ఒక దశలో ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా ఓ కథ చెప్పి చరణ్తో ఓకే చేయించుకున్నట్లు ఇటీవల ఓ వార్త బయటికి వచ్చింది.
మరోవైపు అల్లు కాంపౌండ్లో ఎప్పట్నుంచో తిరుగుతున్న ఓ కొత్త దర్శకుడు కూడా చరణ్ను మెప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వంశీ పైడిపల్లితో చరణ్ కాంబినేషన్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మహేష్తో సినిమా మిస్సయ్యాక చరణ్ కోసం ఓ కథ రెడీ చేసిన వంశీ.. ఇటీవల అతడితో ఓకే చేయించుకున్నట్లు చెబుతున్నారు. ‘ఎవడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందంటున్నారు. మరి ఈ కాంబినేషన్లలో ఏది నిజమవుతుంది.. ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుంది అన్నది చూడాలి.
This post was last modified on July 12, 2020 2:42 pm
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…