మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏడాదిన్నరగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమై ఉన్నాడు. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండాలి. ఈ నెలలోనే ఆ సినిమా విడుదలై ఉండాలి. కానీ ఎప్పట్లాగే రాజమౌళి ఆలస్యం చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే సంక్రాంతికి వాయిదా వేయించాడు. కానీ కరోనా పుణ్యమా అని ఆ డేట్ కూడా అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ సినిమాలో తన పని పూర్తి చేసి చరణ్ ఎఫ్పటికీ ఫ్రీ అవుతాడో చెప్పలేని పరిస్థితి.
ఐతే ఇప్పటికే ‘రంగస్థలం’తో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. అప్పుడు చరణ్తో సినిమా చేసే అవకాశం దక్కితే అది బంపరాఫరే. ఆ ఆఫర్ను దక్కించుకోవడానికి చాలామంది దర్శకులే లైన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కనీసం అరడజను కాంబినేషన్లు అయినా వినిపించి ఉంటాయి. ముందు ‘ఆచార్య’ చేస్తున్న కొరటాల శివతో సినిమా ఉంటుందన్నారు. తర్వాత సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కావచ్చన్నారు. ఒక దశలో ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా ఓ కథ చెప్పి చరణ్తో ఓకే చేయించుకున్నట్లు ఇటీవల ఓ వార్త బయటికి వచ్చింది.
మరోవైపు అల్లు కాంపౌండ్లో ఎప్పట్నుంచో తిరుగుతున్న ఓ కొత్త దర్శకుడు కూడా చరణ్ను మెప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వంశీ పైడిపల్లితో చరణ్ కాంబినేషన్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మహేష్తో సినిమా మిస్సయ్యాక చరణ్ కోసం ఓ కథ రెడీ చేసిన వంశీ.. ఇటీవల అతడితో ఓకే చేయించుకున్నట్లు చెబుతున్నారు. ‘ఎవడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందంటున్నారు. మరి ఈ కాంబినేషన్లలో ఏది నిజమవుతుంది.. ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుంది అన్నది చూడాలి.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…