మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏడాదిన్నరగా ‘ఆర్ఆర్ఆర్’కు అంకితమై ఉన్నాడు. ముందు అనుకున్న ప్రణాళికల ప్రకారం అయితే ఈపాటికి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఉండాలి. ఈ నెలలోనే ఆ సినిమా విడుదలై ఉండాలి. కానీ ఎప్పట్లాగే రాజమౌళి ఆలస్యం చేశాడు.
‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే సంక్రాంతికి వాయిదా వేయించాడు. కానీ కరోనా పుణ్యమా అని ఆ డేట్ కూడా అందుకోవడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ సినిమాలో తన పని పూర్తి చేసి చరణ్ ఎఫ్పటికీ ఫ్రీ అవుతాడో చెప్పలేని పరిస్థితి.
ఐతే ఇప్పటికే ‘రంగస్థలం’తో తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్న చరణ్.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మరింత ఎత్తుకు ఎదగడం ఖాయం. అప్పుడు చరణ్తో సినిమా చేసే అవకాశం దక్కితే అది బంపరాఫరే. ఆ ఆఫర్ను దక్కించుకోవడానికి చాలామంది దర్శకులే లైన్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా కనీసం అరడజను కాంబినేషన్లు అయినా వినిపించి ఉంటాయి. ముందు ‘ఆచార్య’ చేస్తున్న కొరటాల శివతో సినిమా ఉంటుందన్నారు. తర్వాత సుకుమార్ కాంబినేషన్ రిపీట్ కావచ్చన్నారు. ఒక దశలో ‘సైరా’ దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు వినిపించింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా ఓ కథ చెప్పి చరణ్తో ఓకే చేయించుకున్నట్లు ఇటీవల ఓ వార్త బయటికి వచ్చింది.
మరోవైపు అల్లు కాంపౌండ్లో ఎప్పట్నుంచో తిరుగుతున్న ఓ కొత్త దర్శకుడు కూడా చరణ్ను మెప్పించినట్లు ప్రచారం జరిగింది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు వంశీ పైడిపల్లితో చరణ్ కాంబినేషన్ గురించి ఓ వార్త హల్చల్ చేస్తోంది. మహేష్తో సినిమా మిస్సయ్యాక చరణ్ కోసం ఓ కథ రెడీ చేసిన వంశీ.. ఇటీవల అతడితో ఓకే చేయించుకున్నట్లు చెబుతున్నారు. ‘ఎవడు’ తర్వాత వీళ్ల కాంబినేషన్ రిపీట్ కాబోతోందంటున్నారు. మరి ఈ కాంబినేషన్లలో ఏది నిజమవుతుంది.. ఏ సినిమా ముందుగా పట్టాలెక్కుతుంది అన్నది చూడాలి.
This post was last modified on July 12, 2020 2:42 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…