టాలీవుడ్లో సినిమా సినిమాకు లుక్ విషయంలో మార్పు చూపించాలని తపించే కథానాయకుల్లో అల్లు అర్జున్ ఒకడు. గత కొన్నేళ్లలో అతడి సినిమాల్ని పరిశీలిస్తే.. ‘సరైనోడు’కు సరికొత్త కొత్త లుక్లోకి మారాడు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే’లో మరో రకంగా కనిపించాడు. ఆపై ‘నా పేరు సూర్య’లో నెవర్ బిఫోర్ లుక్లో కనిపించాడు. పూర్తిగా అవతారమే మార్చేశాడు.
చివరగా నటించిన ‘అల వైకుంఠపురములో’ కోసం మరో కొత్త లుక్లో కనిపించాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ‘పుష్ప’ కోసం కూడా బన్నీ అవతారం మార్చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జుట్టు, గడ్డం పెంచి బన్నీ ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్లోకి మారాడు. ఇక షూటింగ్ ఆరంభమే తరువాయి అనుకున్న సమయంలో లుక్ కోసం టెస్ట్ షూట్ కూడా జరిగింది.
ఈ షూట్లో బన్నీ లుక్ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతా ఓకే అనుకున్నారు. కానీ అంతలో కరోనా వచ్చి పడింది. నెలలకు నెలలు షూటింగులు ఆగిపోయాయి. సినిమాకు అవసరమైనదానికంటే ఎక్కువగా బన్నీకి గడ్డం పెరిగిపోయింది. తాజాగా బన్నీ హైదరాబాద్ శివార్లలో రోడ్డు పక్కన కారు ఆపి మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేశాడు.
అంత స్పష్టత లేకపోయినా.. గడ్డం బాగా ఎక్కువై బన్నీ గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. కరోనా షరతులు పాటిస్తూ షూటింగ్ చేయాలని ముందు అనుకున్నా.. అది సాధ్యపడదని ‘పుష్ప’ టీం ఆగిపోయినట్లు తెలుస్తోంది. మామూలు పరిస్థితులకు రావడానికి కనీసం రెండు నెలలు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో గడ్డం మెయింటైన్ చేయడం అదీ బన్నీకి కష్టమవుతోందట. ఒకసారి గడ్డం తీసేసి.. మళ్లీ కొత్తగా పెంచి షూటింగ్ అవసరమయ్యే సమయానికి పాత్రకు తగ్గట్లు తయారవ్వాలని బన్నీ భావిస్తున్నాడట.
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సాంకేతికంగా మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. వాటిని తన జీవన విధానంలో భాగం చేసుకున్నాడు. సుఖమయ జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే…
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…