టాలీవుడ్లో సినిమా సినిమాకు లుక్ విషయంలో మార్పు చూపించాలని తపించే కథానాయకుల్లో అల్లు అర్జున్ ఒకడు. గత కొన్నేళ్లలో అతడి సినిమాల్ని పరిశీలిస్తే.. ‘సరైనోడు’కు సరికొత్త కొత్త లుక్లోకి మారాడు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే’లో మరో రకంగా కనిపించాడు. ఆపై ‘నా పేరు సూర్య’లో నెవర్ బిఫోర్ లుక్లో కనిపించాడు. పూర్తిగా అవతారమే మార్చేశాడు.
చివరగా నటించిన ‘అల వైకుంఠపురములో’ కోసం మరో కొత్త లుక్లో కనిపించాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే ‘పుష్ప’ కోసం కూడా బన్నీ అవతారం మార్చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు జుట్టు, గడ్డం పెంచి బన్నీ ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్లోకి మారాడు. ఇక షూటింగ్ ఆరంభమే తరువాయి అనుకున్న సమయంలో లుక్ కోసం టెస్ట్ షూట్ కూడా జరిగింది.
ఈ షూట్లో బన్నీ లుక్ పట్ల అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అంతా ఓకే అనుకున్నారు. కానీ అంతలో కరోనా వచ్చి పడింది. నెలలకు నెలలు షూటింగులు ఆగిపోయాయి. సినిమాకు అవసరమైనదానికంటే ఎక్కువగా బన్నీకి గడ్డం పెరిగిపోయింది. తాజాగా బన్నీ హైదరాబాద్ శివార్లలో రోడ్డు పక్కన కారు ఆపి మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటో ఒకటి షేర్ చేశాడు.
అంత స్పష్టత లేకపోయినా.. గడ్డం బాగా ఎక్కువై బన్నీ గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. కరోనా షరతులు పాటిస్తూ షూటింగ్ చేయాలని ముందు అనుకున్నా.. అది సాధ్యపడదని ‘పుష్ప’ టీం ఆగిపోయినట్లు తెలుస్తోంది. మామూలు పరిస్థితులకు రావడానికి కనీసం రెండు నెలలు పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో గడ్డం మెయింటైన్ చేయడం అదీ బన్నీకి కష్టమవుతోందట. ఒకసారి గడ్డం తీసేసి.. మళ్లీ కొత్తగా పెంచి షూటింగ్ అవసరమయ్యే సమయానికి పాత్రకు తగ్గట్లు తయారవ్వాలని బన్నీ భావిస్తున్నాడట.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…