ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సినిమా ‘లైగర్’. గతంలో ఏ ఫెయిల్యూర్కూ పెద్దగా ప్రభావతం కాని విజయ్ దేవరకొండ ఈ సినిమా ఫలితం విషయంలో మాత్రం షేకైపోయినట్లే కనిపించాడు.
ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు జరిగిన సైమా వేడుకల్లో మాట్లాడుతున్నపుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కనిపించాడు విజయ్. ‘లైగర్’ పేరెత్తకుండా ఆ సినిమా ఫలితం కలిగించిన నిరాశ గురించి ప్రస్తావించాడు. ఐతే నేరుగా ‘లైగర్’ రిజల్ట్ గురించి ఇప్పటిదాకా అతను ఎక్కడా మాట్లాడలేదు. లైగర్ నష్టపరిహారం విషయంలో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్కు, బయ్యర్లకు మధ్య జరుగుతున్న గొడవ గురించి కూడా తనకేమీ పట్టనట్లు ఉండిపోయాడు.
ఐతే తాజాగా విజయ్ ఒక ఇంగ్లిష్ డైలీతో ‘లైగర్’ రిజల్ట్ గురించి ఓపెన్ అయ్యాడు. “లైగర్ లాంటి పెద్ద సినిమాలో నటించడం గొప్ప అవకాశం. ఇందులో నత్తి పాత్రను ఆస్వాదించాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశమంతా తిరగడం, ప్రచారం చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ‘లైగర్’ కోసం శారీరకంగా, మానసికంగా ఎంత కష్టపడాలో అంతా పడ్డాను. నేను చేయగలిగిందంతా చేశా. కానీ ఫలితం దక్కలేదు. తప్పు చేయడం అంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమే. ఒకవేళ ఎవరైనా తప్పు చేయట్లేదంటే. వాళ్లు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించట్లేదనే అర్థం. సక్సెస్ వచ్చినా రాకపోయినా ప్రయత్నం మానకూడదు. అనుకున్న ఫలితం రాకపోయినా ముందుకెళ్లడం ఆపను. జీవితంలో జయాపజయాలు సహజం’’ అని విజయ్ స్పష్టం చేశాడు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఖుషి’ మూవీకి సమంత అనారోగ్యం వల్ల కాస్త బ్రేక్ పడింది.
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…
చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు అధికారే నిబంధనలను ఉల్లంఘించి వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ శివారులోని గంధంగూడ–బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఆరేళ్ల…