తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లను పుల్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ఒకరు. యు టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలో వాటి స్థాయిలో మంచి వసూళ్లే సాధించాయి. ఆమె ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ చిత్రంతో పాటు యశోద అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ అనే తమిళ దర్శక ద్వయం రూపొందించిన యశోద వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సమంతనే. ఆమె పేరు మీదే సినిమాకు క్రేజ్ వచ్చింది. బిజినెస్ జరిగింది. ఐతే విడుదల ముంగిట ప్రమోషన్లకు సమంత అందుబాటులో లేకుండా పోవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురు దెబ్బే. మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతూ సమంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచే ఆమె ఒక ఫొటో కూడా షేర్ చేసింది. ఆమె కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
దీంతో ప్రమోషన్లలో ఇప్పటిదాకా సమంత ఎక్కడా కనిపించలేదు. మామూలుగా సమంత ఉంటే ఇంకే రకమైన ప్రమోషన్ అవసరం లేదు. ఆమె ఒక్కత్తే కావాల్సినంత బజ్ తీసుకురాగలదు. కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్లతో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్, దర్శకులు ఒక్కొక్కరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రమోషన్ సినిమాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో సమంత పెద్ద మనసుతో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కొంచెం వీలుచేసుకుని యాంకర్ సుమతో ఒక వీడియో ఇంటర్వ్యూ చేయడానికి సమంత సిద్ధమైందట. తన అనారోగ్య సూచనలు కనిపించకుండా ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం నిజమే అయితే మాత్రం సామ్ కమిట్మెంట్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…