తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లను పుల్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ఒకరు. యు టర్న్, ఓ బేబీ లాంటి సినిమాలో వాటి స్థాయిలో మంచి వసూళ్లే సాధించాయి. ఆమె ప్రధాన పాత్రలో శాకుంతలం అనే భారీ చిత్రంతో పాటు యశోద అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ అనే తమిళ దర్శక ద్వయం రూపొందించిన యశోద వచ్చే శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
కొంచెం పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ సమంతనే. ఆమె పేరు మీదే సినిమాకు క్రేజ్ వచ్చింది. బిజినెస్ జరిగింది. ఐతే విడుదల ముంగిట ప్రమోషన్లకు సమంత అందుబాటులో లేకుండా పోవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురు దెబ్బే. మయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతూ సమంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచే ఆమె ఒక ఫొటో కూడా షేర్ చేసింది. ఆమె కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టేలా ఉంది.
దీంతో ప్రమోషన్లలో ఇప్పటిదాకా సమంత ఎక్కడా కనిపించలేదు. మామూలుగా సమంత ఉంటే ఇంకే రకమైన ప్రమోషన్ అవసరం లేదు. ఆమె ఒక్కత్తే కావాల్సినంత బజ్ తీసుకురాగలదు. కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్లతో పాటు యాక్షన్ కొరియోగ్రాఫర్, దర్శకులు ఒక్కొక్కరుగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ ప్రమోషన్ సినిమాకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో సమంత పెద్ద మనసుతో ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ కొంచెం వీలుచేసుకుని యాంకర్ సుమతో ఒక వీడియో ఇంటర్వ్యూ చేయడానికి సమంత సిద్ధమైందట. తన అనారోగ్య సూచనలు కనిపించకుండా ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సమాచారం నిజమే అయితే మాత్రం సామ్ కమిట్మెంట్కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
This post was last modified on November 6, 2022 6:09 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…