Movie News

చరణ్ కోసం బాలీవుడ్ దర్శకుడు

ఆర్ఆర్ఆర్ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ఇకపై తన ప్రతి సినిమా వివిధ దేశాల్లో విస్తృత స్థాయిలో మార్కెటింగ్ చేయబడుతుందని గుర్తించిన రామ్ చరణ్ దానికి తగ్గట్టే లైనప్ ని సెట్ చేసుకుంటున్నాడు. మాములుగా ఎవరైనా దర్శకుడికి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నిలబెట్టుకుంటాడనే అభిప్రాయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టుని వదులుకుని మార్చేశాడు. దానికి ప్రత్యేకంగా కారణాలేంటనేది ఇటు చరణ్ కానీ అటు గౌతమ్ కానీ ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చిన సందర్భంలో వాళ్ళుగా చెబితే తప్ప బయటకి రాదు.

ప్రస్తుతం తన పదిహేనో సినిమాని శంకర్ తో చేస్తున్న చరణ్ ఆ తర్వాత సుకుమార్ తో చేతులు కలపడం దాదాపు కన్ఫర్మేనేనని ఇన్ సైడ్ టాక్. ఇటీవలే నిర్మాత అభిషేక్ అగర్వాల్, ది కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, సుక్కులు కలుసుకుంది దీనికోసమేననే ప్రచారం బలంగా ఉంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో ఊర మసాలా అండ పోలీస్ యాక్షన్ డ్రామాల స్పెషలిస్ట్ గా పేరున్న రోహిత్ శెట్టి సైతం చరణ్ తో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయాలనే ప్రతిపాదనతో త్వరలో కలవబోతున్నాడని ముంబై న్యూస్. హిందీ తెలుగు నుంచి రెండు బడా బ్యానర్లు ఇందులో భాగమవుతాయని వినికిడి.

ఒకవేళ ఇదే జరిగితే చరణ్ ని రోహిత్ శెట్టి ఎలా చూపిస్తాడోననే ఆసక్తి కలగడం సహజం. సింగం, సింబా, సూర్యవంశీ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లే కాదు చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి కామెడీ మూవీస్ ని సైతం స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన అనుభవం రోహిత్ శెట్టిది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం భారీ బడ్జెట్ తో పోలీస్ బ్యాక్ డ్రాప్ లోనే ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. అయితే మెగా పవర్ స్టార్ ఇంకా కథ వినలేదు కాబట్టి ఇది ఓకే అవుతుందా లేదా అని చెప్పడానికి కొంత టైం పడుతుంది. ఇంతకీ శంకర్ సినిమా రిలీజ్ 2023లోనే ఉంటుందా అంటే ప్రస్తుతానికి డౌటేనని సమాచారం.

This post was last modified on November 6, 2022 8:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

40 అడుగుల బావిలో పడ్డ భర్తను రక్షించిన 56 ఏళ్ల భార్య

అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…

3 minutes ago

పాత వ్యూహమే: ఎమ్మెల్సీ ఎన్నికలకు గులాబీ పార్టీ దూరం

కాలం కలిసి వచ్చి.. గాలి వాటంగా వీసే వేళలో.. తమకు మించిన తోపులు మరెవరు ఉండరన్నట్లుగా మాటలు మాట్లాడే గులాబీ…

7 minutes ago

స్కూటర్ మీద 311 కేసులు.. రూ.1.6లక్షల ఫైన్!

ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలానాలు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతవరకు ఓకే. హైదరాబాద్ మహానగరంలో అయితే.. ట్రాఫిక్ నియంత్రణ వదిలేసి…

10 minutes ago

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

3 hours ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

3 hours ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీకి డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

14 hours ago