ఒక కుటుంబంలో జరిగే ఈవెంట్ కి ఆ ఫ్యామిలీ లో ఎవరైనా హీరో రాకపోయినా , లేదా తమ్ముడి సినిమాలకు ప్రచారం చేయకపోయినా వారి మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. తాజాగా బన్నీ – శిరీష్ ల మధ్య ఇలాంటి గొడవేదో ఉందని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే బన్నీ శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్వీట్ పెట్టకపోవడంతో అల్లు బ్రదర్స్ మధ్య మాటలు లేవని కన్ఫర్మ్ చేసేసుకున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యాడు. బన్నీ తన సినిమా గురించి ట్వీట్ చేయకపోవడం వెనుక ఉన్న సంగతి బయటపెట్టాడు. “అసలు ట్వీట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా ? అన్ని విషయాలకు ట్వీట్ ఎందుకు ? ఏదైనా స్పెషల్ అకేషన్ కి పెట్టలేదంటే అనుకోవాలి కానీ సినిమాలకు కూడా ట్వీట్ చేయాలనే డిమాండ్ ఏంటి ? అలా చేయకపోతే గొడవలు ఉన్నట్టా ? ఇది నేను బన్నీ బ్రేక్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఏదైనా స్పెషల్ అకేషన్ కి తప్ప నేను బన్నీ గురించి ట్వీట్ చేయను , తను కూడా అంతే.
బన్నీ సినిమా సక్సెస్ ఈవెంట్ కి వస్తున్నాడు. మాకు ఎలాంటి గొడవలు లేవని మేము చెప్పుకోనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు పెద్దగా పట్టించుకోనని అందులో 90 మెసేజ్ లు పాజిటివ్ గా ఉంటే ఓ పది మాత్రం ఇబ్బంది పెట్టి మన మూడ్ మారేలా చేస్తాయని అందుకే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాని శిరీష్ చెప్పుకున్నాడు. మరి రేపు బన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బ్రదర్స్ మధ్య ఇష్యు గురించి ఏమైనా రియాక్ట్ అవుతాడా ? లేదా సినిమా ను టీం ని అభినందించి వెళ్ళిపోతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on November 5, 2022 10:28 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…