ఒక కుటుంబంలో జరిగే ఈవెంట్ కి ఆ ఫ్యామిలీ లో ఎవరైనా హీరో రాకపోయినా , లేదా తమ్ముడి సినిమాలకు ప్రచారం చేయకపోయినా వారి మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. తాజాగా బన్నీ – శిరీష్ ల మధ్య ఇలాంటి గొడవేదో ఉందని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే బన్నీ శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్వీట్ పెట్టకపోవడంతో అల్లు బ్రదర్స్ మధ్య మాటలు లేవని కన్ఫర్మ్ చేసేసుకున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యాడు. బన్నీ తన సినిమా గురించి ట్వీట్ చేయకపోవడం వెనుక ఉన్న సంగతి బయటపెట్టాడు. “అసలు ట్వీట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా ? అన్ని విషయాలకు ట్వీట్ ఎందుకు ? ఏదైనా స్పెషల్ అకేషన్ కి పెట్టలేదంటే అనుకోవాలి కానీ సినిమాలకు కూడా ట్వీట్ చేయాలనే డిమాండ్ ఏంటి ? అలా చేయకపోతే గొడవలు ఉన్నట్టా ? ఇది నేను బన్నీ బ్రేక్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఏదైనా స్పెషల్ అకేషన్ కి తప్ప నేను బన్నీ గురించి ట్వీట్ చేయను , తను కూడా అంతే.
బన్నీ సినిమా సక్సెస్ ఈవెంట్ కి వస్తున్నాడు. మాకు ఎలాంటి గొడవలు లేవని మేము చెప్పుకోనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు పెద్దగా పట్టించుకోనని అందులో 90 మెసేజ్ లు పాజిటివ్ గా ఉంటే ఓ పది మాత్రం ఇబ్బంది పెట్టి మన మూడ్ మారేలా చేస్తాయని అందుకే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాని శిరీష్ చెప్పుకున్నాడు. మరి రేపు బన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బ్రదర్స్ మధ్య ఇష్యు గురించి ఏమైనా రియాక్ట్ అవుతాడా ? లేదా సినిమా ను టీం ని అభినందించి వెళ్ళిపోతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on November 5, 2022 10:28 pm
ఇప్పుడు ఇండస్ట్రీలో వెలుగొందుతున్న చాలామంది దర్శకులు కెరీర్ ఆరంభంలో బాగా ఇబ్బంది పడ్డ వాళ్లే. సినీ పరిశ్రమలోకి వచ్చి అసిస్టెంట్…
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…