ఒక కుటుంబంలో జరిగే ఈవెంట్ కి ఆ ఫ్యామిలీ లో ఎవరైనా హీరో రాకపోయినా , లేదా తమ్ముడి సినిమాలకు ప్రచారం చేయకపోయినా వారి మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ స్ప్రెడ్ అవుతుంది. తాజాగా బన్నీ – శిరీష్ ల మధ్య ఇలాంటి గొడవేదో ఉందని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. దీనికి తగ్గట్టే బన్నీ శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాకు సంబంధించి ఎలాంటి ట్వీట్ పెట్టకపోవడంతో అల్లు బ్రదర్స్ మధ్య మాటలు లేవని కన్ఫర్మ్ చేసేసుకున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యాడు. బన్నీ తన సినిమా గురించి ట్వీట్ చేయకపోవడం వెనుక ఉన్న సంగతి బయటపెట్టాడు. “అసలు ట్వీట్ చేస్తేనే ప్రేమ ఉన్నట్టా ? అన్ని విషయాలకు ట్వీట్ ఎందుకు ? ఏదైనా స్పెషల్ అకేషన్ కి పెట్టలేదంటే అనుకోవాలి కానీ సినిమాలకు కూడా ట్వీట్ చేయాలనే డిమాండ్ ఏంటి ? అలా చేయకపోతే గొడవలు ఉన్నట్టా ? ఇది నేను బన్నీ బ్రేక్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఏదైనా స్పెషల్ అకేషన్ కి తప్ప నేను బన్నీ గురించి ట్వీట్ చేయను , తను కూడా అంతే.
బన్నీ సినిమా సక్సెస్ ఈవెంట్ కి వస్తున్నాడు. మాకు ఎలాంటి గొడవలు లేవని మేము చెప్పుకోనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో కొందరు పెట్టే పోస్టులు పెద్దగా పట్టించుకోనని అందులో 90 మెసేజ్ లు పాజిటివ్ గా ఉంటే ఓ పది మాత్రం ఇబ్బంది పెట్టి మన మూడ్ మారేలా చేస్తాయని అందుకే సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాని శిరీష్ చెప్పుకున్నాడు. మరి రేపు బన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన బ్రదర్స్ మధ్య ఇష్యు గురించి ఏమైనా రియాక్ట్ అవుతాడా ? లేదా సినిమా ను టీం ని అభినందించి వెళ్ళిపోతాడా ? లెట్స్ వెయిట్ అండ్ సీ.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…