నిన్న విడుదలైన ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ వచ్చి అన్నింటిలోకి బెటర్ గా వసూళ్లు రాబడుతోంది. కమర్షియల్ స్కేల్ ఏంటనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది కానీ అనుకున్న దానికంటే మంచి రెస్పాన్సే కనిపిస్తుండటంతో గీతా టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయింది. ప్రమోషన్ పరంగా ఈ అవకాశాన్ని కనక సరిగ్గా వాడుకునే శిరీష్ కి శ్రీరస్తు శుభమస్తు కన్నా పెద్ద హిట్టు వచ్చే అవకాశం ఉండటంతో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. అందులో భాగంగానే రేపు హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో భారీగా సక్సెస్ మీట్ ఒకటి సెట్ చేస్తున్నారు. దీనికో విశేషం ఉంది.
ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి మొదలు టీజర్, ట్రైలర్, ఆఖరికి రిలీజ్ డేట్ వచ్చినా సరే అన్నయ్య అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్ వేయడం మాట్లాడ్డం కానీ జరగలేదు. దీని మీద ఫ్యాన్స్ కూడా చర్చించుకున్నారు. స్వంత తమ్ముడికి సపోర్ట్ ఇవ్వొచ్చుగా అనే కోణంలో సోషల్ మీడియా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా వాటికి చెక్ పెడుతూ రేపు ముఖ్య అతిథిగా బన్నీనే రాబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గానూ చెప్పబోతున్నారు. ఈ మధ్య తరచుగా కొన్ని ఈవెంట్లల కనిపిస్తూ వచ్చిన బన్నీ తమ్ముడి వేడుకకు రావడమంటే ఫ్యాన్స్ కి స్పెషలే.
నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ దీని గురించే చూచాయగా హింట్ ఇచ్చారు. వస్తాడన్నట్టుగానే శిరీష్ తో చెప్పించారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే ఇదంతా జరిగేది కాదు కానీ యూత్ నుంచి ఊర్వశివోకు వచ్చిన స్పందన గీతా బృందానికి సడన్ కిక్ ఇచ్చేసింది. ఇంతకీ అల్లు అర్జున్ సినిమా చూశాడా అంటే రాత్రికి స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారట. గత వారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఈ సినిమాలో రొమాన్స్ కంటెంట్ గురించి ఓపెన్ గా మాట్లాడినట్టు బన్నీ కూడా ఏమైనా చెబుతాడేమో చూడాలి. కౌంట్ పరంగా స్క్రీన్లు గట్టిగానే దక్కించుకున్న ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏడు కోట్లని ట్రేడ్ టాక్.
This post was last modified on November 5, 2022 4:02 pm
గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…
వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్ను హీరీగా…
ఇప్పుడు మధ్య తరగతి వాళ్లు సైతం కోటి.. అంతకంటే ఎక్కువ పెట్టి ఫ్లాట్ కొనే రోజులు వచ్చేశాయి. ధరలు అంతగా…
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…