నిన్న విడుదలైన ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ వచ్చి అన్నింటిలోకి బెటర్ గా వసూళ్లు రాబడుతోంది. కమర్షియల్ స్కేల్ ఏంటనేది ఇంకో రెండు మూడు రోజులు ఆగితే తెలుస్తుంది కానీ అనుకున్న దానికంటే మంచి రెస్పాన్సే కనిపిస్తుండటంతో గీతా టీమ్ వెంటనే అలెర్ట్ అయిపోయింది. ప్రమోషన్ పరంగా ఈ అవకాశాన్ని కనక సరిగ్గా వాడుకునే శిరీష్ కి శ్రీరస్తు శుభమస్తు కన్నా పెద్ద హిట్టు వచ్చే అవకాశం ఉండటంతో పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. అందులో భాగంగానే రేపు హైదరాబాద్ జెఆర్సి కన్వెన్షన్ లో భారీగా సక్సెస్ మీట్ ఒకటి సెట్ చేస్తున్నారు. దీనికో విశేషం ఉంది.
ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి మొదలు టీజర్, ట్రైలర్, ఆఖరికి రిలీజ్ డేట్ వచ్చినా సరే అన్నయ్య అల్లు అర్జున్ దీనికి సంబంధించి ఎలాంటి ట్వీట్ వేయడం మాట్లాడ్డం కానీ జరగలేదు. దీని మీద ఫ్యాన్స్ కూడా చర్చించుకున్నారు. స్వంత తమ్ముడికి సపోర్ట్ ఇవ్వొచ్చుగా అనే కోణంలో సోషల్ మీడియా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా వాటికి చెక్ పెడుతూ రేపు ముఖ్య అతిథిగా బన్నీనే రాబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గానూ చెప్పబోతున్నారు. ఈ మధ్య తరచుగా కొన్ని ఈవెంట్లల కనిపిస్తూ వచ్చిన బన్నీ తమ్ముడి వేడుకకు రావడమంటే ఫ్యాన్స్ కి స్పెషలే.
నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ దీని గురించే చూచాయగా హింట్ ఇచ్చారు. వస్తాడన్నట్టుగానే శిరీష్ తో చెప్పించారు. ఒకవేళ ఫ్లాప్ అయ్యుంటే ఇదంతా జరిగేది కాదు కానీ యూత్ నుంచి ఊర్వశివోకు వచ్చిన స్పందన గీతా బృందానికి సడన్ కిక్ ఇచ్చేసింది. ఇంతకీ అల్లు అర్జున్ సినిమా చూశాడా అంటే రాత్రికి స్పెషల్ స్క్రీనింగ్ ప్లాన్ చేశారట. గత వారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఈ సినిమాలో రొమాన్స్ కంటెంట్ గురించి ఓపెన్ గా మాట్లాడినట్టు బన్నీ కూడా ఏమైనా చెబుతాడేమో చూడాలి. కౌంట్ పరంగా స్క్రీన్లు గట్టిగానే దక్కించుకున్న ఊర్వశివో రాక్షసివో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏడు కోట్లని ట్రేడ్ టాక్.
This post was last modified on November 5, 2022 4:02 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…