waltair veerayya
నెల కిందట గాడ్ ఫాదర్ సినిమాతో సందడి చేశాడు మెగాస్టార్ చిరంజీవి. దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రం ఆచార్య తాలూకు చేదు జ్ఞాపకాలను చాలా వరకు చెరిపివేసిందనే చెప్పాలి. తొలి వారాంతం వరకు ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. కాకపోతే ఆ తర్వాత సినిమా అనుకున్న స్థాయిలో బలంగా నిలబడలేకపోయింది.
ఓవరాల్గా ఈ సినిమా చిరుకు ఓ మోస్తరు ఫలితాన్నందించిందని చెప్పాలి. ఇక మెగా అభిమానుల దృష్టి వాల్తేరు వీరయ్య మీదికి మళ్లింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ రీమేక్ కావడం వల్ల ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేదు. అంతకుముందు ఆచార్య పరిస్థితి తెలిసిందే. వాల్తేరు వీరయ్య అన్ని రకాలుగా అభిమానులను అలరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతుండడం విశేషం.
వాల్తేరు వీరయ్యలో మాస్ రాజా రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కథలో అతడి పాత్రకు చాలా ప్రాధాన్యమే ఉంటుందట. అతడిది చిరు సోదరుడి పాత్ర అని.. తన మీద ఒక అవినీతి ముద్ర పడి అప్రతిష్ట పాలైతే.. దాన్ని చెరిపివేసేందుకు చిరు చేసే ప్రయత్నమే ఈ సినిమా అని అంటున్నారు. చిరుకు ఎలివేషన్ ఇస్తూనే రవితేజ ప్రాధాన్యం కూడా తగ్గకుండా సినిమా ఉంటుందట. రవితేజ పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాలు ఉంటుందట ఈ చిత్రంలో.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి వచ్చే నెలలో ఫస్ట్ కాపీ తీయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
This post was last modified on November 5, 2022 5:33 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…