‘ఊర్వశివో రాక్షసివో’ ఫస్ట్ టీజర్ రిలీజైనపుడు అందులో హీరో హీరోయిన్లు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ల కెమిస్ట్రీ చూసి అందరూ షాకైపోయారు. లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లతో ఆ టీజర్ కుర్రాళ్లకు మంచి కిక్కిచ్చింది. శిరీష్, అనుల రొమాన్స్ అందులో చాలా సహజంగా అనిపించింది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్నట్లుగా కనిపించింది.
తర్వాత ఈ సినిమా ప్రమోషన్ల టైంలో ఇద్దరూ కలిసి చేసిన ప్రమోషన్లు చూసి ఆఫ్ లైన్లోనూ వీరి మధ్య కెమిస్ట్రీ భలేగా వర్కవుట్ అవుతోందని.. ఇద్దరి మధ్య ఏదో ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా రిలీజ్ టైంకి అవి మరింతగా విస్తరించాయి. ఇప్పుడు స్వయంగా అనునే సినిమా సక్సెస్ మీట్లో ఈ విషయం ప్రస్తావించడం విశేషం. తమ ఇద్దరి మధ్య ఏదో ఉందని వస్తున్న వార్తల గురించి స్వయంగా శిరీష్ తండ్రి అల్లు అరవిందే తన దగ్గర ప్రస్తావించినట్లు అను వెల్లడించడం గమనార్హం.
అల్లు అర్జున్తో కలిసి తాను ‘నా పేరు సూర్య’ సినిమా చేసినప్పటి నుంచి తనకు అల్లు ఫ్యామిలీతో అనుబంధం ఏర్పడిట్లు ఆమె వెల్లడించింది. ఐతే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాలో తాను కథానాయికగా ఎంపిక అయ్యే సమయానికి శిరీష్తో తనకు పరిచయమే లేదని.. ఈ సినిమాను తాను అంగీకరించాక శిరీష్తో ఒక కాఫీ షాప్లో కలిసి తమ క్యారెక్టర్ల గురించి డిస్కస్ చేశామని.. ఆ తర్వాత తమ మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయని అను వెల్లడించింది.
మీడియాలో వచ్చే వార్తలు చూసి తన తల్లి కూడా కొంచెం కంగారు పడిందని, ఆమెకు కూడా తాను క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చిందని.. ఆ తర్వాత అల్లు అరవింద్ ఈ విషయాన్ని తన వద్ద సరదాగా ప్రస్తావించారని.. అప్పుడు తామిద్దరం నవ్వుకున్నామని అను తెలిపింది. శిరీష్ మంచి కోస్టార్ అని, తనతో పని చేయడం మంచి అనుభవం అని అను అభిప్రాయపడింది.
This post was last modified on November 5, 2022 1:37 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…