స్టార్ హీరోల పుట్టిన రోజులు, ఇంకేవైనా సందర్భాలు వస్తే వాళ్ల కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమాలను స్పెషల్ షోలుగా వేయడం ఈ మధ్య ఆనవాయితీగా మారుతున్న సంగతి తెలిసిందే. గతంలోనూ ఈ సంప్రదాయం ఉండేది కానీ.. ఈ మధ్య ఈ రీ రిలీజ్లు భారీ స్థాయిలో ఉంటున్నాయి. అందులోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
హీరోల స్టార్ పవర్, బాక్సాఫీస్ స్టామినాకు రుజువులుగా ఈ లెక్కల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఐతే ఈ రికార్డుల పోటీ శ్రుతి మించి అక్కడా ఫేక్ నంబర్లు, రికార్డులు మొదలైపోవడంతో జనాలకు చిరాకు వస్తోంది. ఐతే ఇప్పుడు ఓ సినిమా రీరిలీజ్లో రికార్డులు., నంబర్ల గొడవ లేకుండా ప్రశాంతంగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఆ చిత్రమే.. నువ్వే నువ్వే. ఇటీవలే ఈ చిత్రం 20 వసంతాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ సందర్భంగా ఏఎంబీ మల్టీప్లెక్సులో చిత్ర బృందం వరకు స్పెషల్ షో వేశారు. అప్పుడు కొందరు మీడియా వాళ్లు, అభిమానులు కూడా హాజరు కాగా.. వారి నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ వీకెండ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని మేజర్ సిటీస్లో నువ్వే నువ్వే స్పెషల్ షోలు వేశారు. ఇందులో హీరోగా నటించిన తరుణ్ ఇప్పుడు లైమ్ లైట్లో లేదు. శ్రియ పనైపోయింది. చిత్ర బృందంలో మిగతా వాళ్లందరి కథా ముగిసింది. ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నది త్రివిక్రమ్ మాత్రమే. ఆయనకున్న క్రేజ్తోనే నువ్వే నువ్వే రిలీజైంది.
ఇప్పుడు ఈ సినిమాకు హీరో త్రివిక్రమ్ అనే చెప్పాలి. ఆయన పేరు మీదే ఇన్ని షోలు పడ్డాయి. చాలా వరకు సినిమాకు మంచి ఆక్యుపెన్సీలే వచ్చాయి. హైదరాబాద్లో కొన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ఒక దర్శకుడి కోసం ఇలా థియేటర్లకు జనాలు పెద్ద ఎత్తున రావడం విశేషమే. మాటల మాంత్రికుడి బాక్సాఫీస్ సత్తాకు ఇది నిదర్శనం అని చెప్పాలి.
This post was last modified on November 5, 2022 1:41 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…