Movie News

నో రీమేక్స్ అంటున్న దర్శకుడు

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో రీమేక్స్ హవా నడుస్తుంది. ఒక భాషలో సినిమా హిట్టయితే చాలు వెంటనే దాని రైట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. తెలుగులో కూడా రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. వారానికి మూడు , నాలుగు సినిమాలు రిలీజవుతుంటే అందులో ఒకటైనా రీమేక్ ఉండనే ఉంటుంది. అయితే కుర్ర దర్శకుడు మేర్లపాక గాంధి మాత్రం ఇకపై నో రీమేక్ అంటూ ఓ స్టేట్ మెంట్ పాస్ చేశాడు.

‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో దర్శకుడిగా పరిచయమైన గాంధీ ఆ వెంటనే ఎక్స్ ప్రెస్ రాజా అనే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ‘కృష్ణార్జున యుద్ధం’ మాత్రం మేర్లపాక సక్సెస్ కి బ్రేక్ వేసింది. మొదటి ఫెయిల్యుయర్ నుండి బయట పడి ఇంకో సినిమా చేయడానికి చాలా టైం తీసుకునన్ గాంధీ నితిన్ తో ‘మాస్ట్రో’ అనే రీమేక్ సినిమా చేశాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న ‘అంధదూన్’ సినిమాను ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోయడనే కామెంట్ అందుకున్నాడు. దీంతో డైరెక్ట్ ఓటీటీ లో రిలీజైన మాస్ట్రో కూడా యంగ్ డైరెక్టర్ కి సక్సెస్ ఇవ్వలేకపోయింది.

తాజాగా ఆ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూ స్పందించాడు మేర్లపాక. ఇకపై రీమేక్ చేయనని స్ట్రైట్ సినిమాలే తీస్తానని చెప్పుకున్నాడు. మాస్ట్రో తర్వాత కూడా ఓ పెద్ద సంస్థ నుండి రీమేక్ సినిమా ఆఫర్ వచ్చిందని కానీ తనే వదులుకున్నానని తెలిపాడు. రీమేక్ సినిమా అంటే యాక్టర్ కి కూడా ఆసక్తి ఉండదని, ముఖ్యంగా ఎగ్జైట్ మెంట్ కలగదని అన్నాడు. అందుకే ఇకపై రీమేక్ సినిమా చేయకూడదనే డిసిషన్ తీసుకున్నానని తెలిపాడు. మాస్ట్రో విషయంలో నితిన్ అతని తండ్రి ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యారనే టాక్ వినిపించింది. ఇప్పుడు మేర్లపాక గాంధి రీమేక్స్ పై కామెంట్ చేయడానికి అది కూడా ఓ కారణం అయ్యి ఉండొచ్చు.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

5 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

5 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

5 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

6 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

7 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

8 hours ago