Movie News

చిరంజీవి ట్వీట్ వేసిండహో..

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి రావడం రావడం ఒక తుపానులా వచ్చారు. ఇప్పుడున్న యువ కథానాయకులెవ్వరిలోనూ లేనంత హుషారు చూపించారు. ట్విట్టర్లో వరుసబెట్టి పోస్టులు పెడుతూ.. కౌంటర్లు, సెటైర్లు వేస్తూ.. చాలా సరదాగా కనిపించారు. సరిగ్గా కరోనా ప్రభావం మొదలైన కొత్తలో ఆయన ట్విట్టర్లోకి రావడంతో ఆయనకు ఇది మంచి కాలక్షేపం అయింది. అభిమానులూ ఆయన ట్వీట్ల పట్ల చాలా ఉత్సాహం చూపించారు. నాలుగు నెలల్లోనే వందకు పైగా ట్వీట్లు వేసేశారు చిరు. ఐతే ఈ మధ్య ఉన్నట్లుండి ట్విట్టర్ నుంచి చిరు విరామం తీసుకోవడం, ఆయన్నుంచి కొత్త ట్వీట్లేవీ లేకపోవడం కూడా వార్త అయి కూర్చుంది. గత నెల ఆరంభం నుంచే జోరు తగ్గించిన చిరు.. చివరగా జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా ఒక ఎమోషనల్ ట్వీట్ వేసి సైలెంటైపోయారు.

అప్పట్నుంచి చిరు ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్టులేవీ లేకపోవడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. చిరు ఉన్నట్లుండి ఎందుకు బ్రేక్ తీసుకున్నాడో జనాలకు అర్థం కాలేదు. దీని వెనుక కారణాలను విశ్లేషించే పనిలో పడిపోయారు. ఐతే 20 రోజుల విరామం తర్వాత, శనివారం చిరు మళ్లీ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆయన ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి గురించి వేసిన ట్వీట్ మీద స్పందించారు. కేరళలోని కూనూర్‌కు చెందిన శివన్ అనే పోస్ట్ మ్యాన్ రోజూ 15 కిలోమీటర్లు అడవిలో ప్రమాదకర పరిస్థితుల్లో నడిచి వెళ్లి గ్రామాలకు ఉత్తరాలు ఇచ్చి వస్తుంటాడని.. ఎన్నో ఏళ్లుగా ఇలా చేస్తున్నాడని సుప్రియ సాహు అనే ఐఏఎస్ అధికారి ఇటీవల ట్వీట్ చేశారు. ఈ పోస్టు ఇంటర్నెట్లో వైరల్ అయింది. దీనిపై ఇప్పుడు చిరు స్పందించారు. కొందరు తమ వృత్తిని సమర్థంగా నిర్వహించడంలోనే అత్యంత తృప్తిని పొందుతారని.. ఇలాంటి వాళ్ల వల్లే మానవత్వం బతుకుతుందని చిరు ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ తర్వాత చిరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కొనసాగుతారా మళ్లీ బ్రేక్ తీసుకుంటారా అన్నది చూడాలి.

This post was last modified on July 12, 2020 11:45 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

30 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

2 hours ago

ఉస్తాద్ బిజినెస్ కెపాసిటీ ఎంత

ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…

5 hours ago