మాములుగా తమ అభిమాన హీరో వరసగా సినిమాలు చేయడం కన్నా ఫ్యాన్స్ కి కావలసింది ఏముంది. తెలుగులో చూస్తేనేమో ఏడాదికి ఒకటి చేయడమే మహా భారంగా స్టార్లు ఫీలవుతున్న ట్రెండ్ లో అక్షయ్ కుమార్ వరసగా ప్రాజెక్టులు ఓకే చేయడం పట్ల సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇతను పెద్దగా మార్కెట్ లేని చిన్నవాడైతే పోన్లే ఎన్ని చేస్తే ఏముంది ఎవరు పట్టించుకుంటారని అనుకోవచ్చు. కానీ అక్కి కేసు అలా కాదు. ఎంతలేదన్నా ఒక్కో చిత్రానికి వంద కోట్లకు పైగా మార్కెట్ ముడిపడి ఉంది. అలాంటిది స్టోరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
2021లో సూర్యవంశీ సూపర్ హిట్ అయ్యాక అక్షయ్ కుమార్ డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు సాధించాడు. ఓటిటిలో నేరుగా వచ్చిన అత్రంగీరే,కట్ పుత్లీ(రాక్షసుడు రీమేక్) రెండూ నెగటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. గద్దలకొండ గణేష్ హిందీ రూపం బచ్చన్ పాండే మరీ దారుణంగా వారంకే టపా కట్టేస్తే యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మించిన సామ్రాట్ పృథ్విరాజ్ ఆ సంస్థకు నికరంగా నూటా యాభై కోట్లకు పైగా హారతి కర్పూరం చేసింది. ఇక రక్షా బంధన్ సంగతి సరేసరి. ఇటీవలే రాముడి సెంటిమెంట్ ని వాడుకుందామని చూసిన రామ్ సేతు సైతం డిజాస్టర్ ముద్రను తప్పించుకోలేదు.
ఇన్ని జరిగినా మళ్ళీ అక్షయ్ కుమార్ తనకు సూట్ కాని పాత్రలనే ఎంచుకుంటున్నాడు. వీర్ దౌడ్లే సాత్ అనే మరాఠి కం హిందీ మూవీలో ఛత్రపతి శివాజీ పాత్ర చేస్తున్నాడు. ఇది మాత్రం వద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఇలాంటి చారిత్రాత్మక క్యారెక్టర్స్ కు అక్షయ్ సూట్ కాడని అనవసరమైన ట్రోలింగ్ తప్ప వచ్చే ప్రయోజనం ఏమి ఉండదని అంటున్నారు. అయినా అక్షయ్ వింటేగా. నా దారి నాదే నాకు కౌంట్ ముఖ్యం కానీ కంటెంట్ కాదనే రీతిలో వ్యవహరిస్తున్న తీరు ట్రేడ్ నుంచి సైతం కామెంట్స్ తెచ్చి పెడుతోంది. అలా డిసైడైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…