మాములుగా తమ అభిమాన హీరో వరసగా సినిమాలు చేయడం కన్నా ఫ్యాన్స్ కి కావలసింది ఏముంది. తెలుగులో చూస్తేనేమో ఏడాదికి ఒకటి చేయడమే మహా భారంగా స్టార్లు ఫీలవుతున్న ట్రెండ్ లో అక్షయ్ కుమార్ వరసగా ప్రాజెక్టులు ఓకే చేయడం పట్ల సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. ఇతను పెద్దగా మార్కెట్ లేని చిన్నవాడైతే పోన్లే ఎన్ని చేస్తే ఏముంది ఎవరు పట్టించుకుంటారని అనుకోవచ్చు. కానీ అక్కి కేసు అలా కాదు. ఎంతలేదన్నా ఒక్కో చిత్రానికి వంద కోట్లకు పైగా మార్కెట్ ముడిపడి ఉంది. అలాంటిది స్టోరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
2021లో సూర్యవంశీ సూపర్ హిట్ అయ్యాక అక్షయ్ కుమార్ డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు సాధించాడు. ఓటిటిలో నేరుగా వచ్చిన అత్రంగీరే,కట్ పుత్లీ(రాక్షసుడు రీమేక్) రెండూ నెగటివ్ రివ్యూస్ తెచ్చుకున్నాయి. గద్దలకొండ గణేష్ హిందీ రూపం బచ్చన్ పాండే మరీ దారుణంగా వారంకే టపా కట్టేస్తే యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రెస్టీజియస్ గా నిర్మించిన సామ్రాట్ పృథ్విరాజ్ ఆ సంస్థకు నికరంగా నూటా యాభై కోట్లకు పైగా హారతి కర్పూరం చేసింది. ఇక రక్షా బంధన్ సంగతి సరేసరి. ఇటీవలే రాముడి సెంటిమెంట్ ని వాడుకుందామని చూసిన రామ్ సేతు సైతం డిజాస్టర్ ముద్రను తప్పించుకోలేదు.
ఇన్ని జరిగినా మళ్ళీ అక్షయ్ కుమార్ తనకు సూట్ కాని పాత్రలనే ఎంచుకుంటున్నాడు. వీర్ దౌడ్లే సాత్ అనే మరాఠి కం హిందీ మూవీలో ఛత్రపతి శివాజీ పాత్ర చేస్తున్నాడు. ఇది మాత్రం వద్దు బాబోయ్ అని ఫ్యాన్స్ మొత్తుకుంటున్నారు. ఇలాంటి చారిత్రాత్మక క్యారెక్టర్స్ కు అక్షయ్ సూట్ కాడని అనవసరమైన ట్రోలింగ్ తప్ప వచ్చే ప్రయోజనం ఏమి ఉండదని అంటున్నారు. అయినా అక్షయ్ వింటేగా. నా దారి నాదే నాకు కౌంట్ ముఖ్యం కానీ కంటెంట్ కాదనే రీతిలో వ్యవహరిస్తున్న తీరు ట్రేడ్ నుంచి సైతం కామెంట్స్ తెచ్చి పెడుతోంది. అలా డిసైడైనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు.
This post was last modified on November 4, 2022 8:52 am
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…