కొంతమంది హీరోలు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలి అన్న చందాన అదే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కాకపోతే కొందరు రాబడతారు, కొందరు ఫెయిలవుతారు. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా.. తనకు ఇప్పటివరకు పెద్దగా కలసిరాని అదే జానర్తో మరోసారి తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే సినిమా రిలీజై రివ్యూస్ అన్ని బాగున్నా కూడా, ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు కలక్షన్లు అనుకున్నంత రాకపోవడంతో.. ఇప్పుడు ఈ ‘రన్ రాజా రన్’ కూడా పాత రూట్లోనే వెళ్తున్నాడట.
మొన్నామధ్యన ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లలో భాగంగా.. తన తదుపరి సినిమా.. రౌడీ ఫెలో మూవీ ఫేం కృష్ణచైతన్యతో చేస్తున్నట్లు శర్వా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఒకే ఒక జీవితం రిజల్ట్ చూసిన వెంటనే.. ఆ సినిమాను ఆపేశాడు. ఆ తరువాత ఏం సినిమా చేస్తాడా అనుకుంటుంటే.. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మనోడు ఒక కొత్త సినిమా ఓకే చేశాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరక్టర్ దగ్గర అసోసియేట్గా పనిచేసిన ఒక కొత్త డైరక్టర్ డైరక్షన్లో ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు ఇదొక మాస్ సినిమా అని తెలుస్తోంది. రీసెంట్గా మహాసముద్రం సినిమతో శర్వా మాస్ ప్రయత్నించిగా బెడసి కొట్టింది. అయినాసరే కాంతారా వంటి మాస్ సినిమాలు ఆడేస్తున్నాయ్ కాబట్టి, ఒకే ఒక జీవితం వంటి సాఫ్ట్ సినిమాలు ఆడలేదు కాబట్టి, శర్వా గట్టిగా మళ్ళీ మాస్తోనే కొట్టాలని డిసైడైపోయాడట.
నిజానికి మాస్ సినిమాలు చేస్తే ఆడవు అని చెప్పలేం కాని, ఈ మధ్య కాలంలో మరీ 90లలో తీసిన లాజిక్ లేని హీరోయిజం కాన్సెప్టులతో వచ్చిన సినిమాలు నిరుత్సాహపరిచాయి. నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం, గోపిచంద్ పక్కా కమర్షియల్ ఆ కోవకు చెందినవే. అదే కొత్తగా చిన్న కాన్సెప్టు పట్టుకుని మాస్ సినిమా తీసినా, కాంతారా వంటి సినిమాలు బ్లాక్బస్టర్లు అవుతున్నాయ్. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా.. ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్ చూస్తారు. లేదంటే రిజక్ట్ చేస్తారు. చూద్దాం మరి శర్వానంద్ ఈసారేం చేస్తాడో!
This post was last modified on November 4, 2022 8:52 am
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…