కొంతమంది హీరోలు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలి అన్న చందాన అదే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కాకపోతే కొందరు రాబడతారు, కొందరు ఫెయిలవుతారు. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా.. తనకు ఇప్పటివరకు పెద్దగా కలసిరాని అదే జానర్తో మరోసారి తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే సినిమా రిలీజై రివ్యూస్ అన్ని బాగున్నా కూడా, ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు కలక్షన్లు అనుకున్నంత రాకపోవడంతో.. ఇప్పుడు ఈ ‘రన్ రాజా రన్’ కూడా పాత రూట్లోనే వెళ్తున్నాడట.
మొన్నామధ్యన ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లలో భాగంగా.. తన తదుపరి సినిమా.. రౌడీ ఫెలో మూవీ ఫేం కృష్ణచైతన్యతో చేస్తున్నట్లు శర్వా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఒకే ఒక జీవితం రిజల్ట్ చూసిన వెంటనే.. ఆ సినిమాను ఆపేశాడు. ఆ తరువాత ఏం సినిమా చేస్తాడా అనుకుంటుంటే.. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మనోడు ఒక కొత్త సినిమా ఓకే చేశాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరక్టర్ దగ్గర అసోసియేట్గా పనిచేసిన ఒక కొత్త డైరక్టర్ డైరక్షన్లో ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు ఇదొక మాస్ సినిమా అని తెలుస్తోంది. రీసెంట్గా మహాసముద్రం సినిమతో శర్వా మాస్ ప్రయత్నించిగా బెడసి కొట్టింది. అయినాసరే కాంతారా వంటి మాస్ సినిమాలు ఆడేస్తున్నాయ్ కాబట్టి, ఒకే ఒక జీవితం వంటి సాఫ్ట్ సినిమాలు ఆడలేదు కాబట్టి, శర్వా గట్టిగా మళ్ళీ మాస్తోనే కొట్టాలని డిసైడైపోయాడట.
నిజానికి మాస్ సినిమాలు చేస్తే ఆడవు అని చెప్పలేం కాని, ఈ మధ్య కాలంలో మరీ 90లలో తీసిన లాజిక్ లేని హీరోయిజం కాన్సెప్టులతో వచ్చిన సినిమాలు నిరుత్సాహపరిచాయి. నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం, గోపిచంద్ పక్కా కమర్షియల్ ఆ కోవకు చెందినవే. అదే కొత్తగా చిన్న కాన్సెప్టు పట్టుకుని మాస్ సినిమా తీసినా, కాంతారా వంటి సినిమాలు బ్లాక్బస్టర్లు అవుతున్నాయ్. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా.. ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్ చూస్తారు. లేదంటే రిజక్ట్ చేస్తారు. చూద్దాం మరి శర్వానంద్ ఈసారేం చేస్తాడో!
This post was last modified on November 4, 2022 8:52 am
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…