కొంతమంది హీరోలు ఎన్నిసార్లు దెబ్బలు తగిలినా కూడా పోగొట్టుకున్న చోటనే రాబట్టుకోవాలి అన్న చందాన అదే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. కాకపోతే కొందరు రాబడతారు, కొందరు ఫెయిలవుతారు. ఇప్పుడు హీరో శర్వానంద్ కూడా.. తనకు ఇప్పటివరకు పెద్దగా కలసిరాని అదే జానర్తో మరోసారి తన సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యనే సినిమా రిలీజై రివ్యూస్ అన్ని బాగున్నా కూడా, ‘ఒకే ఒక జీవితం’ సినిమాకు కలక్షన్లు అనుకున్నంత రాకపోవడంతో.. ఇప్పుడు ఈ ‘రన్ రాజా రన్’ కూడా పాత రూట్లోనే వెళ్తున్నాడట.
మొన్నామధ్యన ఒకే ఒక జీవితం సినిమా ప్రమోషన్లలో భాగంగా.. తన తదుపరి సినిమా.. రౌడీ ఫెలో మూవీ ఫేం కృష్ణచైతన్యతో చేస్తున్నట్లు శర్వా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఒకే ఒక జీవితం రిజల్ట్ చూసిన వెంటనే.. ఆ సినిమాను ఆపేశాడు. ఆ తరువాత ఏం సినిమా చేస్తాడా అనుకుంటుంటే.. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా మనోడు ఒక కొత్త సినిమా ఓకే చేశాడని తెలుస్తోంది. ఒక ప్రముఖ డైరక్టర్ దగ్గర అసోసియేట్గా పనిచేసిన ఒక కొత్త డైరక్టర్ డైరక్షన్లో ఈ సినిమాను చేస్తున్నాడు. అంతేకాదు ఇదొక మాస్ సినిమా అని తెలుస్తోంది. రీసెంట్గా మహాసముద్రం సినిమతో శర్వా మాస్ ప్రయత్నించిగా బెడసి కొట్టింది. అయినాసరే కాంతారా వంటి మాస్ సినిమాలు ఆడేస్తున్నాయ్ కాబట్టి, ఒకే ఒక జీవితం వంటి సాఫ్ట్ సినిమాలు ఆడలేదు కాబట్టి, శర్వా గట్టిగా మళ్ళీ మాస్తోనే కొట్టాలని డిసైడైపోయాడట.
నిజానికి మాస్ సినిమాలు చేస్తే ఆడవు అని చెప్పలేం కాని, ఈ మధ్య కాలంలో మరీ 90లలో తీసిన లాజిక్ లేని హీరోయిజం కాన్సెప్టులతో వచ్చిన సినిమాలు నిరుత్సాహపరిచాయి. నితిన్ చేసిన మాచర్ల నియోజకవర్గం, గోపిచంద్ పక్కా కమర్షియల్ ఆ కోవకు చెందినవే. అదే కొత్తగా చిన్న కాన్సెప్టు పట్టుకుని మాస్ సినిమా తీసినా, కాంతారా వంటి సినిమాలు బ్లాక్బస్టర్లు అవుతున్నాయ్. మాస్ సినిమా అయినా క్లాస్ సినిమా అయినా.. ఎంగేజింగ్గా ఉంటే ఆడియన్స్ చూస్తారు. లేదంటే రిజక్ట్ చేస్తారు. చూద్దాం మరి శర్వానంద్ ఈసారేం చేస్తాడో!
This post was last modified on November 4, 2022 8:52 am
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…