మేజర్ దేశవ్యాప్త బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అడవి శేష్ కు ఇండియా వైడ్ గుర్తింపు వచ్చేసింది. ఇంతకు ముందంటే కేవలం తెలుగు మార్కెట్ నే దృష్టిలో పెట్టుకుని కథలు ఎంపిక చేసుకునేవాడు కాబట్టి క్షణం లాంటి ఇన్స్ ఫైర్డ్ మూవీ, ఎవరు లాంటి రీమేక్ రెండూ ఆడియన్స్ దగ్గర పాసైపోయాయి. ఇకపై అలా ఉండదు. నిర్మాతలు తనతో చేసే సినిమాలను దేశవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకునేందుకు చూస్తారు. డబ్బింగ్ హక్కులకు మంచి డిమాండ్ ఉంటుంది. రీమేక్ కన్నా అనువదించడం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఆ కోణంలోనే బిజినెస్ డీల్స్ జరుగుతాయి.
ఇప్పుడీ ప్రస్తావనకు కారణముంది. ఉదయం హిట్ 2 ది సెకండ్ కేస్ టీజర్ వచ్చింది. ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కంటెంట్ సాలిడ్ గానే ఉంది. స్టోరీ పరంగా మరీ విభిన్నంగా ఏమీ అనిపించలేదు కానీ వీడియో చివర్లో చూపించిన అమ్మాయి డెత్ సీన్ తాలూకు విజువల్ మాత్రం సెన్సిటివ్ జనాలకు ఇబ్బంది కలిగించేలానే ఉంది. నేలపై యువతి శవాన్ని ముక్కలుగా విడగొట్టి పడుకోబెట్టిన తీరు క్రియేటివిటీ కోణంలో బాగుండొచ్చు కానీ శేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ పెరిగిన నేపథ్యంలో ఇంతటి హింసను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అనేది అనుమానమే
ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ కథల్లో ఉన్నట్టుగానే మెయిన్ ప్లాట్ కనిపిస్తోంది. కనిపించకుండా దారుణంగా హత్యలు చేసే ఒక సైకో కిల్లర్, చూసేందుకు జుగుప్సగా అనిపించే రీతిలో శవాలను పోలీసులకు అందించే తీరు కమల్ హాసన్ ఎర్రగులాబీల నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు దాకా ఎన్నో వచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి.ఫ్లాపులు పడ్డాయి. వెబ్ సిరీస్ లు వచ్చాక వీటి తాకిడి మరింత ఎక్కువగా పెరిగింది. మరి హిట్ 2లో దర్శకుడు శైలేష్ కొలను ఎలాంటి ట్విస్టులు పెట్టాడో చూడాలి. హిట్ 1 హిందీలో డిజాస్టరైన నేపథ్యంలో ఇప్పడీ సీక్వెల్ ని హిందీలో డబ్ చేసే అవకాశాలు ఎక్కువ
This post was last modified on November 3, 2022 4:53 pm
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం…