Samanthaకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి తెలుసుకుని ఆమె అభిమానులు ఎంతో బాధ పడుతున్నారు. ఇండస్ట్రీ జనాలు కూడా ఆమెకు ఓదార్పును, తమ వంతు సహకారాన్ని అందించే ప్రయత్నంలో ఉన్నారు. సమంతకు వచ్చిన జబ్బు మరీ ప్రమాదకరం కాదు. అలా అని తేలిగ్గా తీసుకునేది కూడా కాదు. సరైన చికిత్స అందితే ఆమె దాన్నుంచి బయటపడుతుంది. వైద్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు.
ఐతే Samantha పై సానుభూతి చూపాల్సింది పోయి.. ఇదే అదనుగా యూట్యూబ్ ఛానెళ్లు వ్యూస్ కోసం దిగజారిపోయి ప్రవర్తిస్తుండడం షాకింగ్. ఫిలిం సెలబ్రెటీల గురించి దారుణమైన థంబ్ నైల్స్ పెట్టడం.. తీరా వీడియో ఓపెన్ చేస్తే అందులో ఏ విషయం లేకపోవడం.. ఇదంతా అందరికీ తెలిసిన వ్యవహారమే. వీడియోల్లో ఏమీ ఉండదని తెలిసి కూడా థంబ్ నైల్ చూసి అట్రాక్ట్ అయ్యేవాళ్లు చాలామంది ఉంటారు. వీరి బలహీనతే యూట్యూబ్ ఛానెళ్లకు పెట్టుబడిగా మారుతోంది.
ఇప్పుడు Samantha అనారోగ్యం మీద చిత్ర విచిత్రమైన థంబ్ నైల్స్ పెట్టి పబ్బం గడుపుకునే పనిలో పడ్డాయి యూట్యూబ్ ఛానెళ్లు. సమంత అనారోగ్యం గురించి తెలిసి నాగచైతన్య ఆమెకు ఫోన్ చేశాడట.. అయ్యో సామ్ నావల్లే ఇదంతా అయింది అని పశ్చాత్తాప పడ్డాడట.. ఈ టైంలో ఎక్కడో ఉండడం కరెక్ట్ కాదు, ఇంటికి వచ్చేయ్ అన్నాడట.. ఆమె కోసం గుడికి వెళ్లాడట.. అమెరికాలో తనకు తెలిసిన డాక్టర్తో మాట్లాడాడట.. చైతూ ఆసుపత్రికి వెళ్తుంటే నాగ్ టెన్షన్ పడ్డాడట.. ఆసుపత్రికి వెళ్లిన చైతూకు అవమానం ఎదురైందట.. ఇలా ఎన్నెన్నో అర్థాలతో థంబ్ నైల్స్ పెట్టి పండగ చేసుకుంటున్నాయి యూట్యూబ్ చానెల్స్.
కేవలం చైతూతో సరిపెట్టకుండా అఖిల్ తన మాజీ వదినను ఇంటికి వచ్చేయమన్నాడని.. ఎన్టీఆర్ సమంత పరిస్థితి చూసి అయ్యో అనుకున్నాడని.. రామ్ చరణ్, ఉపాసన సమంత కోసం ఆసుపత్రికి పరుగులు పెట్టారని.. సమంతను ఉపాసన అమ్మలా చూసుకుందని.. ఇలా ఎన్నెన్నో థంబ్ నైల్స్ ఇప్పుడు యూట్యూబ్ను ముంచెత్తుతున్నాయి. ఇంతకుముందు Samantha విడాకుల విషయంలో కూడా ఈ ఛానెళ్లు ఇలాగే దిగజారి ప్రవర్తించాయి. ఇప్పుడు మరింత శ్రుతి మించాయి. ఈ థంబ్ నైల్స్ చూసి జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.
This post was last modified on November 3, 2022 4:57 pm
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…