Movie News

కంటెంట్ ఎక్కడ వీరయ్య ?

బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి లేటెస్ట్ గా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ టీజర్ వదిలిన సంగతి తెలిసిందే. ఉన్నపళంగా సినిమాను సంక్రాంతి బరిలో దింపాలనే నిర్ణయంతో ప్రమోషన్స్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు మేకర్స్. కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఫ్యాన్స్ కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. అవును వీరయ్య టైటిల్ చెప్తూ వచ్చిన ఒక్క మోషన్ పోస్టర్ టీజర్ తప్ప ఇంకా ఈ సినిమా నుండి ఎలాంటి కంటెంట్ రివీల్ చేయలేదు.

ఒక వైపు సంక్రాంతి పోటీలో బాలయ్య సినిమా నుండి ఇప్పటికే మంచి కంటెంట్ వచ్చేసింది. సినిమాలో ఉండే యాక్షన్ గ్లిమ్స్ , పవర్ ఫుల్ డైలాగ్ తో కథ గురించి క్లుప్తంగా చూపిస్తూ టీజర్ వదిలేశారు. ఆ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. వీరయ్య -వీర సింహా రెడ్డి పోటీ లో ఇప్పటి వరకూ కంటెంట్ తో ఇంప్రెస్ చేసింది బాలయ్యే. త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రాబోతుంది. డిసెంబర్ లో గట్టి ప్రమోషన్స్ చేయబోతున్నారు.

నిజానికి వాల్తేరు వీరయ్య మీద కూడా మంచి అంచనాలున్నాయి. చిరు వింటేజ్ లుక్ లో మాస్ గెటప్ తో కనిపిస్తూ ఆడియన్స్ ను ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తారనే టాక్ ఉంది. సినిమాకు సంబంధించి టాక్ కూడా బాగుంది. కానీ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే కంటెంట్ కూడా వదలడం మొదలు పెడితే బెటర్. ఓ వైపు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆతృతగా చూస్తున్నారు. దేవి సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో అనే టెన్షన్ కూడా ఫ్యాన్స్ లో మొదలైంది. మరి వీరయ్య కంటెంట్ తో హంగామా చేసే తరుణం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

This post was last modified on November 3, 2022 3:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago