సంతోష్ శోభన్ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ నవంబర్ 4న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం టీం చేయాల్సినవన్నీ చేశారు. ఇక సినిమా చూడటం చూడకపోవడం అనేది ప్రేక్షకుల చేతిల్లోనే ఉంది. తాజాగా హీరో సంతోష్ శోభన్ అలాగే కమెడియన్ ఓ మల్టిప్లెక్స్ కెళ్ళి అక్కడ జనాలతో ఓ రియాలిటీ వీడియో చేశారు. ఆ వీడియోలో సుదర్శన్ అసలు మన సినిమా గురించి జనాలకు తెలుసా ? పదా చూద్దాం అంటూ సంతోష్ ని తీసుకెళ్తాడు. ముందు ఈ హీరో తెలుసా ? అనే ప్రశ్నకి చాలా మంది సమాదానం చెప్పలేకపోయారు. ఇక ఈ హీరో నుండి రాబోయే సినిమా తెలుసా ? అని అడిగితే దానికి చాలా మంది నో అంటూ ఆన్సర్ ఇచ్చారు.
అయితే ఆ వీడియోలో కమెడియన్ సుదర్శన్ మన సినిమాకి ఫస్ట్ డే జనాలు రారు కదా అనగానే హీరో సంతోష్ శోభన్ ఎందుకు రారు అంటూ కోపంగా రియాక్ట్ అవుతాడు. వెంటనే సుదర్శన్ నువ్వే మైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా ? బుకింగ్స్ ఓపెన్ చేయగానే అందరూ బుక్ చేసేసుకోవడానికి అంటూ రియాలిటీ చెప్తూ పంచ్ వేస్తాడు. ఇది ప్రమోషన్స్ కోసం టీం ప్లాన్ చేసిన వీడియో అయినప్పటికీ ఇందులో సుదర్శన్ మాత్రం చాలా రియాలిటీ గా విషయం చెప్పేశాడు.
ప్రస్తుతం సంతోష్ శోభన్ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ బుకింగ్స్ చూస్తుంటే సుదర్శన్ చెప్పిందే జరిగింది. ఈ సినిమా ఎక్కడా పెద్దగా టికెట్లు తెగట్లేదు. పోనియ్ మిగతా సినిమాలకు ఏమైనా బుకింగ్స్ బాగున్నాయా అనే అవి కూడా కష్టంగానే ఉన్నాయి. సో సంతోష్ శోభన్ హిట్ టాక్ తెచ్చుకుంటే ఓ మోస్తరు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఓటీటీ హీరో అనిపించుకున్న ఈ యంగ్ హీరో మరి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి హిట్ సాదిస్తాడో చూడాల్సిందే.
This post was last modified on November 3, 2022 9:37 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…