తాజాగా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పఠాన్ టీజర్ సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్ కు ఇది సంతృప్తినిచ్చినప్పటికీ మిగిలిన జనాలకు మాత్రం బోలెడు అనుమానాలు కలిగించేసింది. టెర్రిఫిక్ అనిపించే యాక్షన్ విజువల్స్, బాద్షాని చాలా ఏళ్ళుగా చూడని వయొలెంట్ క్యారెక్టర్ కొంచెం కొత్తగానే ఉన్నాయి కానీ గతంలో చూసిన ఫీలింగే కలిగించడంతో పాటు విఎఫ్ఎక్స్ కు సంబంధించిన కొన్ని లోపాలు స్లో మోషన్ లో చూసుకుంటే బాగా హై లైట్ అవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇస్తున్నారు
సాహో ట్రైలర్ వచ్చినప్పుడు మిక్స్డ్ రియాక్షన్స్ కన్నా పాజిటివ్ ఫీడ్ బ్యాకే ఎక్కువగా వచ్చింది. ఎంతగా అంటే ఇదే షారుఖ్ దర్శకుడు సుజిత్ కి పర్సనల్ గా ఫోన్ చేసి అభినందించేంతని ముంబై మీడియాలో వార్త కూడా వచ్చింది. వన్ అఫ్ ది బెస్ట్ ట్రైలర్ కట్ గా సాహోకి ప్రశంసలు దక్కిన మాట వాస్తవం. కాకపోతే అసలు సినిమాలో మ్యాటర్ తక్కువగా ఉండటంతో ఫలితం తేడా కొట్టింది కానీ ఒకవేళ కంటెంట్ కనక కరెక్ట్ గా కనెక్ట్ అయ్యుంటే బాహుబలిని దాటేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ పఠాన్ కు అంత భీభత్సమైన రెస్పాన్స్ అయితే రాలేదు.
అనవసరంగా అప్పట్లో సాహోని తిట్టామే అని ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా దీనికి మద్దతు ఇవ్వడం గమనార్హం. రెండు పోల్చుకుని చూస్తే ప్రభాస్ దే చాలా రెట్లు మెరుగ్గా కనిపించడం అతిశయోక్తి కాదు. మరి ఇంత గ్యాప్ తర్వాత భారీ బిల్డప్ తో వస్తున్న పఠాన్ కింగ్ ఖాన్ కి ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. జనవరిలో ఇదొచ్చేదాకా బాలీవుడ్ బాక్సాఫీస్ చప్పగానే ఉండనుంది. డిసెంబర్ చివరి వారంలో సర్కస్ వస్తే సరి. లేదంటే అంతే సంగతులు. సంక్రాంతి ఆది పురుష్ డ్రాప్ అయ్యాక దాన్ని స్థానాన్ని భర్తీ చేసే స్థాయిలో ఏ హిందీ సినిమా సిద్ధంగా లేదు. సో షారుఖ్ ఒకడే దిక్కవుతాడు,
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…