ఒకప్పట్లా దక్షిణాది సినిమాలను బాలీవుడ్ తారలు తక్కువగా చూసే పరిస్థితి లేదు. అక్కడ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వాళ్లను సౌత్ సినిమాల కోసం అడిగితే గొంతెమ్మ కోర్కెలు కోరడం, సౌత్ సినిమాల్లో తాము నటించడమేంటి అన్నట్లు చూడడం ఉండేది. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను మించి డిమాండ్ తెచ్చుకున్న సౌత్ చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు వెనుకంజ వేసే పరిస్థితి లేదు.
దీపికా పదుకొనే, కియారా అద్వానీ, దిశా పఠాని లాంటి టాప్ హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ను సైతం తెలుగులో నటింపజేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమె పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి దీనిపై క్లారిటీ రావట్లేదు.
ఈలోపు తన కొత్త చిత్రం మిలి ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి హైదరాబాద్కు వచ్చింది జాన్వి. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమెకు ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయమై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఎన్టీఆర్ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ ఒక లెజెండ్. అతడితో కలిసి నటించాలని నాకూ ఉంది అని చెప్పింది.
సౌత్ ఇండస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కూడా జాన్వి పేర్కొంది. తెలుగులో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారట, ఏదైనా స్పెషల్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారా అని జాన్విని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానికి ఆమె తండ్రి బోనీ కపూర్ బదులిచ్చారు. ఆ విషయాలు మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదని సమాధానం దాటవేశారు. మిలి సినిమా విషయానికి వస్తే ఇది మలయాళ హిట్ మూవీ హెలెన్కు రీమేక్. హిందీలో ఈ చిత్రాన్ని మత్తుకుట్టి జేవియర్ రూపొందించగా.. బోనీకపూర్ నిర్మించాడు.
This post was last modified on November 3, 2022 6:57 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…