ఒకప్పట్లా దక్షిణాది సినిమాలను బాలీవుడ్ తారలు తక్కువగా చూసే పరిస్థితి లేదు. అక్కడ స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న వాళ్లను సౌత్ సినిమాల కోసం అడిగితే గొంతెమ్మ కోర్కెలు కోరడం, సౌత్ సినిమాల్లో తాము నటించడమేంటి అన్నట్లు చూడడం ఉండేది. కానీ ఇప్పుడు హిందీ సినిమాలను మించి డిమాండ్ తెచ్చుకున్న సౌత్ చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు వెనుకంజ వేసే పరిస్థితి లేదు.
దీపికా పదుకొనే, కియారా అద్వానీ, దిశా పఠాని లాంటి టాప్ హీరోయిన్లు సౌత్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ను సైతం తెలుగులో నటింపజేయడానికి కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందించనున్న కొత్త చిత్రంలో హీరోయిన్ పాత్రకు ఆమె పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు కాబట్టి దీనిపై క్లారిటీ రావట్లేదు.
ఈలోపు తన కొత్త చిత్రం మిలి ప్రమోషన్లలో భాగంగా తన టీంతో కలిసి హైదరాబాద్కు వచ్చింది జాన్వి. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆమెకు ఎన్టీఆర్ సినిమాలో నటించే విషయమై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. ఇప్పటికే చాలాసార్లు చెప్పా. ఎన్టీఆర్ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఎన్టీఆర్ ఒక లెజెండ్. అతడితో కలిసి నటించాలని నాకూ ఉంది అని చెప్పింది.
సౌత్ ఇండస్ట్రీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కూడా జాన్వి పేర్కొంది. తెలుగులో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారట, ఏదైనా స్పెషల్ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారా అని జాన్విని ఓ విలేకరి ప్రశ్నించగా.. దానికి ఆమె తండ్రి బోనీ కపూర్ బదులిచ్చారు. ఆ విషయాలు మాట్లాడ్డానికి ఇది సరైన వేదిక కాదని సమాధానం దాటవేశారు. మిలి సినిమా విషయానికి వస్తే ఇది మలయాళ హిట్ మూవీ హెలెన్కు రీమేక్. హిందీలో ఈ చిత్రాన్ని మత్తుకుట్టి జేవియర్ రూపొందించగా.. బోనీకపూర్ నిర్మించాడు.
This post was last modified on November 3, 2022 6:57 am
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…