ఈ వారం బాక్సాఫీస్ దండయాత్రకు పది సినిమాల దాకా రెడీ అవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి కొన్నే. అందులో కాస్త ఎక్కువ హైప్ తెచ్చుకున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ను హీరోగా పెట్టి అతడి తండ్రి అల్లు అరవింద్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇంతకుముందు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత అనే సినిమా తీసిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఓ తమిళ చిత్రానికి రీమేక్గా చెబుతున్న ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అను ఇమ్మాన్యుయెల్ అనడంలో సందేహం లేదు. నిజానికి ఆమె మీద టాలీవుడ్లో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. తన సినిమాలు చాలా వరకు ఫ్లాపులు కావడమే అందుక్కారణం. అలాంటి హీరోయిన్ని హిట్టు కోసం ఎదురు చూస్తున్న శిరీష్ పక్కన హీరోయిన్గా తీసుకోవడం ఆశ్చర్యమే.
కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనునే అవుతోంది. ఆమెతో శిరీష్ చేసిన లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లే సినిమాకు హైప్ తెచ్చాయి. ప్రోమోల్లో అవే హైలైట్ అయ్యాయి. యూత్ ఈ సినిమా పట్ల ఆకర్షితులై థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది ప్రధానంగా ఇందులో అనుతో ముడిపడ్డ హాట్ హాట్ సీన్లు, పాటల కోసమే.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆమె అందాలే పెట్టుబడి. కొన్ని నెలల ముందు వరకు అసలు వార్తల్లోనే లేని సినిమా ఇప్పుడు ఓ మోస్తరు బజ్తో రిలీజవుతోందంటే హాట్ హాట్ ప్రోమోలే కారణం. కానీ కేవలం అవి సినిమా పట్ల కుర్రాళ్లను ఆకర్షితుల్ని చేస్తాయి కానీ.. సినిమాను నిలబెట్టాల్సింది మాత్రం కథాకథనాలే. మరి క్వాలిటీకి పేరుపడ్డ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ విషయంలో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ఈ శుక్రవారమే ఊర్వశివో రాక్షసివో థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on November 3, 2022 6:56 am
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…