ఈ వారం బాక్సాఫీస్ దండయాత్రకు పది సినిమాల దాకా రెడీ అవుతున్నాయి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి కొన్నే. అందులో కాస్త ఎక్కువ హైప్ తెచ్చుకున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అల్లు శిరీష్ను హీరోగా పెట్టి అతడి తండ్రి అల్లు అరవింద్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇంతకుముందు కళ్యాణ్ దేవ్ హీరోగా విజేత అనే సినిమా తీసిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఓ తమిళ చిత్రానికి రీమేక్గా చెబుతున్న ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అను ఇమ్మాన్యుయెల్ అనడంలో సందేహం లేదు. నిజానికి ఆమె మీద టాలీవుడ్లో ఐరెన్ లెగ్ ముద్ర పడిపోయింది. తన సినిమాలు చాలా వరకు ఫ్లాపులు కావడమే అందుక్కారణం. అలాంటి హీరోయిన్ని హిట్టు కోసం ఎదురు చూస్తున్న శిరీష్ పక్కన హీరోయిన్గా తీసుకోవడం ఆశ్చర్యమే.
కానీ ఇప్పుడు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అనునే అవుతోంది. ఆమెతో శిరీష్ చేసిన లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లే సినిమాకు హైప్ తెచ్చాయి. ప్రోమోల్లో అవే హైలైట్ అయ్యాయి. యూత్ ఈ సినిమా పట్ల ఆకర్షితులై థియేటర్లకు వెళ్లేందుకు సిద్ధపడుతోంది ప్రధానంగా ఇందులో అనుతో ముడిపడ్డ హాట్ హాట్ సీన్లు, పాటల కోసమే.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆమె అందాలే పెట్టుబడి. కొన్ని నెలల ముందు వరకు అసలు వార్తల్లోనే లేని సినిమా ఇప్పుడు ఓ మోస్తరు బజ్తో రిలీజవుతోందంటే హాట్ హాట్ ప్రోమోలే కారణం. కానీ కేవలం అవి సినిమా పట్ల కుర్రాళ్లను ఆకర్షితుల్ని చేస్తాయి కానీ.. సినిమాను నిలబెట్టాల్సింది మాత్రం కథాకథనాలే. మరి క్వాలిటీకి పేరుపడ్డ గీతా ఆర్ట్స్ సంస్థ ఈ విషయంలో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి. ఈ శుక్రవారమే ఊర్వశివో రాక్షసివో థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on November 3, 2022 6:56 am
గత ఏడాది డిసెంబర్ లో రిలీజైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ…
కొన్ని ల్యాండ్ మార్క్ సినిమాలకు కాలదోషం ఉండదు. టాలీవుడ్ స్థాయిని ప్రపంచ వీధుల దాకా తీసుకెళ్లి అక్కడ జెండా పాతేలా…
మాటల మాంత్రీకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోడీపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమ వ్యం గ్యాస్త్రాలు,…
ఈ ఏడాది ఎండలు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఏకంగా 44, 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీచేస్తున్నది. ఆంధ్రప్రదేశ్,…
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…