చాన్నాళ్ల తర్వాత సమంత నటించిన ఫుల్ లెంగ్త్ మూవీ ఒకటి థియేటర్లలోకి దిగబోతోంది. అది లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడం విశేషం. ఈ ఉపోద్ఘాతం ‘యశోద’ గురించే అని ఈపాటికే అర్థమై ఉంటుంది. తెలుగులో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను థియేటర్లకు పుల్ చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్లలో సమంత ఒకరు.
‘యశోద’కు అతి పెద్ద బలం ఆమే అనడంలో సందేహం లేదు. గతంలో ‘ఓ బేబీ’, ‘యు టర్న్’ చిత్రాలతో సమంత సత్తా అందరికీ తెలిసింది. అందుకే కొంచెం పెద్ద బడ్జెట్టే పెట్టి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రూపొందించాడు. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా సమంత పాపులరే కాబట్టి ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సక్సెస్ కొడతామని చిత్ర బృందం ధీమాగా ఉంది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి.
ఐతే అన్నీ ఉన్నా కానీ.. రిలీజ్ దగ్గర పడేసరికి సమంత ప్రమోషన్లు అందుబాటులో లేకుండా పోవడం సినిమాకు పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ రోజుల్లో సినిమాకు హైప్ పెంచడంలో ప్రి రిలీజ్ ప్రమోషన్లు చాలా కీలకం. అందులోనూ ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రమోషన్ మరింత అవసరం. పైగా తన సినిమాలను సమంత ప్రమోట్ చేసే తీరు వేరుగా ఉంటుంది. ఆమె మీడియా ముందుకు వస్తే అందరూ అటు వైపు చూస్తారు. పైగా గత ఏడాది కాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల వల్ల తను మీడియా ముందుకు వస్తే క్యూరియాసిటీ ఇంకా పెరుగుతుంది. ఆ ఉత్సాహంతోనే అందరూ సామ్ కోసం ఎదురు చూస్తుంటే.. ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
ఇప్పటికప్పుడు వెంటనే కోలుకుని ఉత్సాహంగా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. విడుదలకు వారం రోజులే ఉండగా.. సమంత ఆసుపత్రిలో ఉండడం చిత్ర బృందాన్ని కలవరపెడుతోంది. మరి ప్రమోషన్ లేకుండా కేవలం కంటెంట్తో, సమంతకున్న ఆకర్షణతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.
This post was last modified on November 2, 2022 7:11 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…