జీరో వచ్చి మూడేళ్లు దాటింది. కింగ్ షారుఖ్ ఖాన్ ని తెరమీద చూసి అంత గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని తెరపై చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు. వరస డిజాస్టర్ల దెబ్బకు డిఫెన్స్ లో పడ్డ షారుఖ్ ఆ తర్వాత నెలల పాటు ఖాళీగా ఉన్నాడు. తన పరాజయాలకు కారణాలను విశ్లేషించుకుంటూనే సరైన కాంబినేషన్లు కథల కోసం ఎదురు చూస్తూ వచ్చాడు. ఇంతకాలానికి పఠాన్ రెడీ అయ్యింది. సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ని ఇవాళ షారుఖ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు
కథ మరీ ఎగ్జైటింగ్ గా ఏమీ లేదు. పఠాన్(షారుఖ్ ఖాన్) అనే గూఢచారి కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోతాడు. శత్రవులకు దొరికి చిత్రహింసలు అనుభవించాక అసలు బ్రతికి ఉన్నాడో లేదో అనే అనుమానం వస్తుంది. తీరా చూస్తే సజీవంగా బయటికి వచ్చి విధ్వంస కాండ మొదలుపెడతాడు. ఇతన్ని అడ్డుకోవడానికి ఓ సమాంతర శక్తి(జాన్ అబ్రహం), అండగా నిలించి ఫైట్లు గట్రా చేసేందుకు ఒక డైనమిక్ ప్రియురాలు(దీపికా పదుకునే)ఇలా అంతా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోయింది . ఇంతకీ పఠాన్ అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, అతను ఎంచుకున్న మిషన్ ఏంటనేది సినిమాలో చూడాలి.
దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తన గత చిత్రం వార్ మోడల్ లోనే ఈ పఠాన్ ని డిజైన్ చేశాడు. నమ్మశక్యం కానీ యాక్షన్ ఎపిసోడ్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే పోరాట దృశ్యాలు ఇందులోనూ పుష్కలంగా దట్టించేశారు. కాకపోతే షారుఖ్ ని ఇంత భీభత్సమైన వయొలెన్స్ సెటప్ లో చూసి చాలా కాలమయ్యింది కాబట్టి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉండొచ్చు. విజువల్స్ మాత్రం హై ఎండ్ వేల్యూస్ తో అదరగొట్టేశారు. హిందీతో పాటు తమిళం తెలుగులోనూ ఐమ్యాక్స్ ఫార్మాట్ లో జనవరి 25 రిలీజవుతున్న పఠాన్ షారుఖ్ కోరుకున్న బలమైన కంబ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి
This post was last modified on November 2, 2022 11:34 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…