ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక మీమ్ వైరల్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమాను స్పేస్లో రిలీజ్ చేయడం కోసం అక్కడికెళ్లి చిత్ర బృందం ప్రమోషన్లు చేస్తుండగా.. అక్కడున్న ఒక ఏలియన్తో దాని భాషలో తారక్ మాట్లాడుతున్నట్లుగా ఈ మీమ్ క్రియేట్ చేశారు. జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం వెళ్లి అక్కడ జపనీస్ భాషలో చక్కగా మాట్లాడ్డం చూసి తారక్ మీద ఈ మీమ్ క్రియేట్ చేశారు నెటిజన్లు.
ఆర్ఆర్ఆర్ను ఇండియాలో ప్రమోట్ చేసినపుడు ముంబయికెళ్లి హిందీలో, చెన్నైకి వెళ్లి తమిళంలో, అలాగే కర్ణాటకకు వెళ్లి కన్నడలో తారక్ ఎంత బాగా మాట్లాడాడో అందరూ చూశారు. ఎన్టీఆర్ ఏకసంతాగ్రాహి, బహు భాషా నైపుణ్య ఉన్నవాడని ముందు నుంచే అందరికీ తెలుసు. ఇప్పుడు అతడి నైపుణ్యం అందరికీ మరింత బాగా అర్థమవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల టైంలోనే కన్నడలో చాలా చక్కగా మాట్లాడి ఆశ్చర్యపరిచాడు తారక్.
ఇక మంగళవారం కర్ణాటక దినోత్సవం సందర్భంగా దివంగత పునీత్ రాజ్కుమార్కు కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేసిన కార్యక్రమానికి రజినీతో కలిసి విశిష్ట అతిథిగా వెళ్లాడు తారక్. అందరూ అనుకున్నట్లే తారక్ ఈ వేడుకలో కన్నడలో చక్కటి ప్రసంగం చేశాడు. పునీత్ అభిమానులను ఉద్వేగానికి గురి చేసేలా, కన్నడిగులందరూ మెచ్చేలా అతడి ప్రసంగం సాగింది. రజినీకి సైతం కన్నడ తెలుసు కాబట్టి ఆయన కూడా ఆ భాషలోనే మాట్లాడాడు. కానీ తారక్ వాక్చాతుర్యం సంగతి తెలిసిందే కాబట్టి అతను తనదైన శైలిలో ప్రసంగించి ఆకట్టుకున్నాడు.
ఐతే తారక్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ఈ ప్రసంగం చూసి ఎవ్వరికీ ఆశ్చర్యం అయితే కలగట్లేదు. అందరూ తన మీద పెట్టుకున్న అంచనాలను తారక్ అందుకున్నాడంతే. తారక్ తల్లి కన్నడిగురాలే కావడంతో అతడికి ఈ భాష మీద మరింత పట్టు ఏర్పడింది.
This post was last modified on November 2, 2022 11:05 am
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…