ఏదేమైనా కూడా బాలీవుడ్ భామలకు ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంలో ఉన్నంత క్లారిటీ మనోళ్లకు లేదనే చెప్పాలి. ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే.. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తమ అందచందాలతో ప్రతీ ప్రెస్ మీట్లో బాగా ఆకట్టుకుంటారు. తెరపై చేసింది ఒక సాధారణ యువతి పాత్రే అయినా కూడా, మీడియా సమావేశాలకు మాత్రం ఘాటైన లుక్స్ తో విచ్చేస్తారు. ఆ తరువాత.. ఈ అందానికి తమ తెలివిని కూడా బాగా యాడ్ చేస్తారు. మీకింకా సందేహం ఉంటే.. ఒక్కసారి జాన్వి కపూర్ దగ్గరకు వెళ్ళొద్దాం రండి.
తన కొత్త సినిమా ‘మిలి’ ప్రమోషన్లలో బిజీగా ఉంది జాన్వి. ఓ నెల క్రితం ‘గుడ్ లక్ జెర్రి’ సినిమాను ప్రమోట్ చేయడానికి వెస్ట్రన్ దుస్తుల్లో హంగామా చేసిన ఈ సుందరి.. ఇప్పుడు చీరకట్టులో చూడీదారుల్లో గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అదంతా ఒకెత్తయితే.. ప్రతీ ఇంటర్యూలోనే సౌత్ సినిమాల గురించి.. తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ఉందని.. అడగకుండానే సెలవిస్తోంది. ఇక ఎన్టీఆర్ అండ్ బన్నీ పేర్లు చెప్పిన వెంటనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోందంతే. దానితో త్వరలో తెలుగు సినిమా చేస్తుందేమో అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. నిజానికి ఒక్క సౌత్ సినిమాను కూడా సైన్ చెయ్యని జాన్వి, కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రం ఇలా తెలుగు సినిమాల గురించి, తమిళ సినిమా గురించి మాట్లాడుతుంటే.. అది కేవలం అటెన్షన్ కోసమేనని అర్ధంచేసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టదులే.
ఒక ప్రక్కన సౌత్ స్టార్ల పేర్లు చెప్పేసి హైప్ తెస్తూ.. మరో ప్రక్కన సౌత్ సినిమాల రీమేక్ లతోనే అమ్మడు వరుసగా తన ఫ్యాన్స్ కు ఎంటర్టయిన్మెంట్ అందిస్తోంది. మొన్న వచ్చిన గుడ్ లక జెర్రీ.. ఓటిటిలోనే విడుదలైంది కాని.. ఆ సినిమా నయనతార ‘కొలమావు కోకిల’ రీమేక్. అలాగే ఇప్పుడు ధియేటర్లకు రాబోతున్న ‘మిలి’ సినిమా కూడా.. మలయాళం సినిమా ‘హెలెన్’ రీమేక్. అది సంగతి.
This post was last modified on November 1, 2022 10:16 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…