ఏదేమైనా కూడా బాలీవుడ్ భామలకు ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలి అనే విషయంలో ఉన్నంత క్లారిటీ మనోళ్లకు లేదనే చెప్పాలి. ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే.. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ తమ అందచందాలతో ప్రతీ ప్రెస్ మీట్లో బాగా ఆకట్టుకుంటారు. తెరపై చేసింది ఒక సాధారణ యువతి పాత్రే అయినా కూడా, మీడియా సమావేశాలకు మాత్రం ఘాటైన లుక్స్ తో విచ్చేస్తారు. ఆ తరువాత.. ఈ అందానికి తమ తెలివిని కూడా బాగా యాడ్ చేస్తారు. మీకింకా సందేహం ఉంటే.. ఒక్కసారి జాన్వి కపూర్ దగ్గరకు వెళ్ళొద్దాం రండి.
తన కొత్త సినిమా ‘మిలి’ ప్రమోషన్లలో బిజీగా ఉంది జాన్వి. ఓ నెల క్రితం ‘గుడ్ లక్ జెర్రి’ సినిమాను ప్రమోట్ చేయడానికి వెస్ట్రన్ దుస్తుల్లో హంగామా చేసిన ఈ సుందరి.. ఇప్పుడు చీరకట్టులో చూడీదారుల్లో గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. అదంతా ఒకెత్తయితే.. ప్రతీ ఇంటర్యూలోనే సౌత్ సినిమాల గురించి.. తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని, జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని ఉందని.. అడగకుండానే సెలవిస్తోంది. ఇక ఎన్టీఆర్ అండ్ బన్నీ పేర్లు చెప్పిన వెంటనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోందంతే. దానితో త్వరలో తెలుగు సినిమా చేస్తుందేమో అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి. నిజానికి ఒక్క సౌత్ సినిమాను కూడా సైన్ చెయ్యని జాన్వి, కేవలం సినిమా ప్రమోషన్ల సమయంలో మాత్రం ఇలా తెలుగు సినిమాల గురించి, తమిళ సినిమా గురించి మాట్లాడుతుంటే.. అది కేవలం అటెన్షన్ కోసమేనని అర్ధంచేసుకోవడానికి పెద్దగా టైమ్ పట్టదులే.
ఒక ప్రక్కన సౌత్ స్టార్ల పేర్లు చెప్పేసి హైప్ తెస్తూ.. మరో ప్రక్కన సౌత్ సినిమాల రీమేక్ లతోనే అమ్మడు వరుసగా తన ఫ్యాన్స్ కు ఎంటర్టయిన్మెంట్ అందిస్తోంది. మొన్న వచ్చిన గుడ్ లక జెర్రీ.. ఓటిటిలోనే విడుదలైంది కాని.. ఆ సినిమా నయనతార ‘కొలమావు కోకిల’ రీమేక్. అలాగే ఇప్పుడు ధియేటర్లకు రాబోతున్న ‘మిలి’ సినిమా కూడా.. మలయాళం సినిమా ‘హెలెన్’ రీమేక్. అది సంగతి.
This post was last modified on November 1, 2022 10:16 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…