ఒక్కో సినిమా పబ్లిసిటీకి ఒక్కో విషయం సాయపడుతుంటుంది. కొన్ని సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో హీరోలూ స్టార్ గెస్టులూ మాట్లాడే స్పీచ్ ఎక్కడలేని బజ్ తెచ్చిపెడుతుంది. కొన్ని సినిమాలకు వెరైటీగా ప్రమోషన్లు చేయడం కారణంగా చాలా అటెన్షన్ వస్తుంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం హీరో మీదున్న నెగెటివ్ వేవ్ కారణంగా.. ఆ సినిమాలు బాగున్నా కూడా ఆడవు. కొన్నిసార్లు మాత్రం.. సదరు స్టార్ మీదున్న సింపతీ వేవ్ కారణంతో.. సినిమాలు ఆడే ఛాన్సుంది కూడా. ఇప్పుడు ఇలాంటి సింపతీ సమంత కొత్త సినిమాకు ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఒక ఆసక్తికరమైన టాపిక్ గా మారింది.
నిజానికి సమంత ప్రమోట్ చేస్తే కాని ”యశోద” సినిమాకు హైప్ రాదని అందరూ అనుకున్నారు కాని, మొన్న రిలీజైన ట్రైలర్ తో మాంచి బజ్ వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్ అలాగే సౌండ్ డిజైన్ చాలా బాగుండటంతో సినిమాకు చాలా హైప్ వచ్చేసింది. అయితే సమంత తన సినిమాలను చాలా రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో అతి బీభత్సంగా ప్రమోట్ చేస్తుంటుంది. ఈసారెందుకు సైలెంటుగా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో.. తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని.. అందుకే బయటకు రాలేకపోతున్నాను అన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి తన అభిమానులను తీవ్రమైన ఆందోళనలోకి నెట్టిసింది సమంత. కాకపోతే ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల దగ్గర నుండి త్వరగా కోలుకోమంటూ మెసేజులు రావడంతో.. సమంత హెల్త్ కండీషన్ మాత్రమే కాకుండా, ఆమె సినిమాకు కూడా బాగా హైప్ వచ్చేసింది.
అయితే ఇప్పుడున్న బాక్సాఫీస్ స్థితిగతులు చూసుకుంటే.. సినిమాకు చాలా అద్భుతమైన టాక్ వస్తేగాని ఆడియన్స్ ధియేటర్లకు రావట్లేదు. ఈ సమయంలో యశోద సినిమాకు సింపతీ వేవ్ కారణంగా తొలి రోజున ధియేటర్లకు ప్రేక్షకులు భారీ స్థాయిలో వచ్చే ఆస్కారమున్నా కూడా.. ఆ తరువాత నుండి మాత్రం టాక్ అనేదే చాలా ముఖ్యమైనది. ఒకవేళ సింపతీ వేవ్ కారణంతో సినిమా యావరేజ్ గా ఉన్నా ఆడేసిందంటే మాత్రం.. సమంత తన కెరియర్లో కేవలం ఇనస్టాగ్రామ్ ఫాలోవర్లనే కాకుండా నిజంగానే కోట్లమంది అభిమానాన్ని సంపాదించినట్లే.
This post was last modified on November 1, 2022 10:16 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…