ఒక్కో సినిమా పబ్లిసిటీకి ఒక్కో విషయం సాయపడుతుంటుంది. కొన్ని సినిమాలకు ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో హీరోలూ స్టార్ గెస్టులూ మాట్లాడే స్పీచ్ ఎక్కడలేని బజ్ తెచ్చిపెడుతుంది. కొన్ని సినిమాలకు వెరైటీగా ప్రమోషన్లు చేయడం కారణంగా చాలా అటెన్షన్ వస్తుంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం హీరో మీదున్న నెగెటివ్ వేవ్ కారణంగా.. ఆ సినిమాలు బాగున్నా కూడా ఆడవు. కొన్నిసార్లు మాత్రం.. సదరు స్టార్ మీదున్న సింపతీ వేవ్ కారణంతో.. సినిమాలు ఆడే ఛాన్సుంది కూడా. ఇప్పుడు ఇలాంటి సింపతీ సమంత కొత్త సినిమాకు ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఒక ఆసక్తికరమైన టాపిక్ గా మారింది.
నిజానికి సమంత ప్రమోట్ చేస్తే కాని ”యశోద” సినిమాకు హైప్ రాదని అందరూ అనుకున్నారు కాని, మొన్న రిలీజైన ట్రైలర్ తో మాంచి బజ్ వచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా విజువల్స్, కాన్సెప్ట్ అలాగే సౌండ్ డిజైన్ చాలా బాగుండటంతో సినిమాకు చాలా హైప్ వచ్చేసింది. అయితే సమంత తన సినిమాలను చాలా రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో అతి బీభత్సంగా ప్రమోట్ చేస్తుంటుంది. ఈసారెందుకు సైలెంటుగా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో.. తనకు మయోసైటిస్ వ్యాధి సోకిందని.. అందుకే బయటకు రాలేకపోతున్నాను అన్నట్లు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టేసి తన అభిమానులను తీవ్రమైన ఆందోళనలోకి నెట్టిసింది సమంత. కాకపోతే ఆ తరువాత చాలామంది సెలబ్రిటీల దగ్గర నుండి త్వరగా కోలుకోమంటూ మెసేజులు రావడంతో.. సమంత హెల్త్ కండీషన్ మాత్రమే కాకుండా, ఆమె సినిమాకు కూడా బాగా హైప్ వచ్చేసింది.
అయితే ఇప్పుడున్న బాక్సాఫీస్ స్థితిగతులు చూసుకుంటే.. సినిమాకు చాలా అద్భుతమైన టాక్ వస్తేగాని ఆడియన్స్ ధియేటర్లకు రావట్లేదు. ఈ సమయంలో యశోద సినిమాకు సింపతీ వేవ్ కారణంగా తొలి రోజున ధియేటర్లకు ప్రేక్షకులు భారీ స్థాయిలో వచ్చే ఆస్కారమున్నా కూడా.. ఆ తరువాత నుండి మాత్రం టాక్ అనేదే చాలా ముఖ్యమైనది. ఒకవేళ సింపతీ వేవ్ కారణంతో సినిమా యావరేజ్ గా ఉన్నా ఆడేసిందంటే మాత్రం.. సమంత తన కెరియర్లో కేవలం ఇనస్టాగ్రామ్ ఫాలోవర్లనే కాకుండా నిజంగానే కోట్లమంది అభిమానాన్ని సంపాదించినట్లే.
This post was last modified on November 1, 2022 10:16 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…