పూజా హెగ్డేతో ముద్దు ఎవరైనా వద్దు అంటారా? కానీ టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం అందుకు ‘నో’ అనే అంటున్నాడు. అలా అని పూజా ఏమీ అతడికి ముద్దిస్తా అని అనలేదు. ఏదైనా సినిమా కోసం ఆమెతో లిప్ లాక్ చేయాలని ఏ దర్శకుడూ అతడికి కండిషన్ పెట్టలేదు.
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో హోస్ట్ చేసే ‘అన్స్టాపబుల్’ షో రెండో సీజన్లో కొత్త ఎపిసోడ్కు శర్వానంద్తో కలిసి అతిథిగా హాజరైన శేష్కు బాలయ్య నుంచే ఒక కొంటె ప్రశ్న ఎదురైంది. ఏ హీరోయిన్తో కిస్ వద్దురా బాబూ అని నీకు అనిపిస్తుంది అని బాలయ్య అడగ్గా.. పూజా హెగ్డే అని బదులిచ్చి పెద్ద షాకిచ్చాడు శేష్. అయినా ఈ టాప్ హీరోయిన్తో ముద్దు వద్దని అంత బలంగా శేష్ ఎందుకు ఫిక్సయ్యాడో ఏంటో మరి. త్వరలోనే ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో ఇలాంటి కొంటె ముచ్చట్లు చాలానే ఉన్నాయి.
ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి సతాయించేస్తున్నారని.. టాలీవుడ్లో శర్వానంద్, ప్రభాస్ లాంటి పెద్దవాళ్లు ఇంకా పెళ్లి చేసుకోకుండా తాను ఏం చేసుకుంటానని శేష్ అనగా… నేను ఆయన (ప్రభాస్) పేరు చెప్పుకుని తిరుగుతుంటే నువ్వు నా పేరు వాడుకుంటున్నావా అని శర్వా అతణ్ని ఎదురు ప్రశ్నించాడు. మరోవైపు శర్వాకు హైదరాబాద్లో చాలా ఖరీదైన భూములు ఉన్నాయని ప్రచారం ఉన్న నేపథ్యంలో కాకతీయ హిల్స్లో ఎన్ని బిట్లు, ఎన్ని గజాల్లో ఉన్నాయి అని అడిగాడు బాలయ్య. అన్నీ ఐదొందల గజాల బిట్లే అని శర్వా చెప్పగా.. ఇంతకీ నీ ఫోన్లు ఎన్ని బిట్లున్నాయి అంటూ తన కొంటెతనం ప్రదర్శించాడు బాలయ్య.
ఇక షోలో భాగంగా బాలయ్య అడిగిన ఒక ప్రశ్న హైలైట్ అని చెప్పాలి. సెల్ఫీ అడిగితే చెంప చెల్లుమనిపించే హీరో ఎవరు అని బాలయ్య అడగ్గా శేష్, శర్వానే కాక ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరూ కూడా గొల్లుమన్నారు. ఇది బాలయ్య తన మీద తాను వేసుకున్న సెటైర్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.
This post was last modified on November 1, 2022 5:30 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…