పూజా హెగ్డేతో ముద్దు ఎవరైనా వద్దు అంటారా? కానీ టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్ మాత్రం అందుకు ‘నో’ అనే అంటున్నాడు. అలా అని పూజా ఏమీ అతడికి ముద్దిస్తా అని అనలేదు. ఏదైనా సినిమా కోసం ఆమెతో లిప్ లాక్ చేయాలని ఏ దర్శకుడూ అతడికి కండిషన్ పెట్టలేదు.
నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీలో హోస్ట్ చేసే ‘అన్స్టాపబుల్’ షో రెండో సీజన్లో కొత్త ఎపిసోడ్కు శర్వానంద్తో కలిసి అతిథిగా హాజరైన శేష్కు బాలయ్య నుంచే ఒక కొంటె ప్రశ్న ఎదురైంది. ఏ హీరోయిన్తో కిస్ వద్దురా బాబూ అని నీకు అనిపిస్తుంది అని బాలయ్య అడగ్గా.. పూజా హెగ్డే అని బదులిచ్చి పెద్ద షాకిచ్చాడు శేష్. అయినా ఈ టాప్ హీరోయిన్తో ముద్దు వద్దని అంత బలంగా శేష్ ఎందుకు ఫిక్సయ్యాడో ఏంటో మరి. త్వరలోనే ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో ఇలాంటి కొంటె ముచ్చట్లు చాలానే ఉన్నాయి.
ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి సతాయించేస్తున్నారని.. టాలీవుడ్లో శర్వానంద్, ప్రభాస్ లాంటి పెద్దవాళ్లు ఇంకా పెళ్లి చేసుకోకుండా తాను ఏం చేసుకుంటానని శేష్ అనగా… నేను ఆయన (ప్రభాస్) పేరు చెప్పుకుని తిరుగుతుంటే నువ్వు నా పేరు వాడుకుంటున్నావా అని శర్వా అతణ్ని ఎదురు ప్రశ్నించాడు. మరోవైపు శర్వాకు హైదరాబాద్లో చాలా ఖరీదైన భూములు ఉన్నాయని ప్రచారం ఉన్న నేపథ్యంలో కాకతీయ హిల్స్లో ఎన్ని బిట్లు, ఎన్ని గజాల్లో ఉన్నాయి అని అడిగాడు బాలయ్య. అన్నీ ఐదొందల గజాల బిట్లే అని శర్వా చెప్పగా.. ఇంతకీ నీ ఫోన్లు ఎన్ని బిట్లున్నాయి అంటూ తన కొంటెతనం ప్రదర్శించాడు బాలయ్య.
ఇక షోలో భాగంగా బాలయ్య అడిగిన ఒక ప్రశ్న హైలైట్ అని చెప్పాలి. సెల్ఫీ అడిగితే చెంప చెల్లుమనిపించే హీరో ఎవరు అని బాలయ్య అడగ్గా శేష్, శర్వానే కాక ఆడిటోరియంలో ఉన్న వాళ్లందరూ కూడా గొల్లుమన్నారు. ఇది బాలయ్య తన మీద తాను వేసుకున్న సెటైర్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…