నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి మల్టీ బిలియన్ డాలర్ కంపెనీలు ఉన్న గ్రౌండ్లోకి దిగి ఆడాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇండస్ట్రీలో ఉన్న అనుభవం, పలుకుబడితో తెలుగు సినిమా ఓటిటి కంటెంట్ వరకు రాబట్టవచ్చు అని అల్లు అరవింద్ పెద్ద గేమ్ ప్లాన్ లేకుండానే ఆహా మొదలు పెట్టేసారు.
వీలయినన్ని సినిమాల ఎక్స్క్లూజివ్ రైట్స్ కొనేయడంతో పాటు తగినన్ని ఒరిజినల్ సిరీస్ కూడా రెడీ చేసుకుని రంగంలోకి రావాల్సింది… పాత మెగా సినిమాలు పెట్టుకుని వచ్చేసారు. ఊహించినట్టుగానే ఆహా పోటీలో వెనుకబడిపోయింది. ఇంకా ఈ సంస్థ ఏ పెద్ద సినిమా హక్కులు పొందలేదు. ఇప్పుడిప్పుడే ఈ గేమ్ అర్థం చేసుకుంటున్న అల్లు అరవింద్ కంటెంట్ మీద ఫోకస్ పెట్టారు.
సినిమా నిర్మాణం అయితే ఒక్కసారి ఒక్క సినిమానే సెట్స్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉండదు. కానీ వెబ్ కంటెంట్ అలా కాదు. అంతా ఒక్కరే చూసుకోవడం కుదరదు. అందుకే వంశీ పైడిపల్లి, నందిని రెడ్డి, హరీష్ శంకర్, మారుతీ తదితరుల సాయం తీసుకుంటున్నారని సమాచారం. తాజాగా దిల్ రాజు కూడా అల్లు అరవింద్ కి జతగా వచ్చారట. ఆయన కూడా కంటెంట్ ప్రొడక్షన్ తో పాటు కంటెంట్ ఫైనల్ చేయడంలో పాత్ర పోషిస్తారట. టాలీవుడ్ ఏకమవుతున్న ఆహా మరి ఓటిటి జయంట్స్ ని ఎలా ఇరుకున పెడుతుందో చూడాలి.
This post was last modified on July 14, 2020 9:37 am
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…