మహేష్ బాబు బావ అనే గుర్తింపుతోనే చాలా ఏళ్ల పాటు బండి నడిపించాడు సుధీర్ బాబు. ఐతే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి సినిమాలు సుధీర్ బాబుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన మైనస్లన్నింటినీ ఆ సినిమాలతో దాదాపుగా అధిగమించాడతను. మహేష్ బాబు తెర వెనుక సపోర్ట్ ఉన్నప్పటికీ.. సొంతంగా అవకాశాలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు.
ఐతే అతడికి ఈ మధ్య అస్సలు టైం కలిసి రావట్లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురువుతున్నాయి. అలా అని సుధీర్కు అవకాశాలకేమీ కొదవ లేదు. ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘వి’ అనే మరో సినిమా చేశాడు సుధీర్. నాని కూడా నటించిన ఈ సినిమాను ఇంద్రగంటి తన స్టైల్కు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్గా తీశాడు. కానీ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఓటీటీలో రిలీజైనప్పటికీ.. దీని రెస్పాన్స్ చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి.
ఇక గత ఏడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. అది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ఈ రెండు చిత్రాల్లోనూ సుధీర్ నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మరో క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను పలకరించాడు సుధీర్. అది కూడా తుస్సుమనిపించింది. కానీ సినిమాలు వరుసగా పోతున్నా సుధీర్కు ఛాన్సులకైతే లోటు లేదు.
ఆల్రెడీ భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో ‘హంట్’ అనే యాక్షన్ మూవీ చేశాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే రిలీజైన దాని టీజర్ ఆకట్టుకుంది. దీంతో పాటుగా నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మాయా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ హీరోగా ఇంకో సినిమా అనౌన్స్ అయింది. జ్ఞానశేఖర్ అనే కొత్త దర్శకుడితో అతను చేస్తున్న ఈ సినిమాకు ‘హరోం హర’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని టైటిల్ వీడియో చూస్తే సుధీర్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా డివోషనల్ యాంగిల్లో సాగే సినిమాలా కనిపిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇదట.
This post was last modified on October 31, 2022 10:13 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…