మహేష్ బాబు బావ అనే గుర్తింపుతోనే చాలా ఏళ్ల పాటు బండి నడిపించాడు సుధీర్ బాబు. ఐతే కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, నన్ను దోచుకుందువటే, సమ్మోహనం లాంటి సినిమాలు సుధీర్ బాబుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తన మైనస్లన్నింటినీ ఆ సినిమాలతో దాదాపుగా అధిగమించాడతను. మహేష్ బాబు తెర వెనుక సపోర్ట్ ఉన్నప్పటికీ.. సొంతంగా అవకాశాలు అందుకునే స్థాయికి చేరుకున్నాడు.
ఐతే అతడికి ఈ మధ్య అస్సలు టైం కలిసి రావట్లేదు. వరుసగా ఫ్లాపులు ఎదురువుతున్నాయి. అలా అని సుధీర్కు అవకాశాలకేమీ కొదవ లేదు. ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణతో ‘వి’ అనే మరో సినిమా చేశాడు సుధీర్. నాని కూడా నటించిన ఈ సినిమాను ఇంద్రగంటి తన స్టైల్కు భిన్నంగా యాక్షన్ థ్రిల్లర్గా తీశాడు. కానీ సినిమా దారుణంగా బోల్తా కొట్టింది. ఓటీటీలో రిలీజైనప్పటికీ.. దీని రెస్పాన్స్ చూస్తే డిజాస్టర్ అనే చెప్పాలి.
ఇక గత ఏడాది ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్. అది కూడా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టరే అయింది. ఈ రెండు చిత్రాల్లోనూ సుధీర్ నటనకు ప్రశంసలు వచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటితో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మరో క్లాస్ మూవీ చేసి ప్రేక్షకులను పలకరించాడు సుధీర్. అది కూడా తుస్సుమనిపించింది. కానీ సినిమాలు వరుసగా పోతున్నా సుధీర్కు ఛాన్సులకైతే లోటు లేదు.
ఆల్రెడీ భవ్య క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థలో ‘హంట్’ అనే యాక్షన్ మూవీ చేశాడు. అది విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే రిలీజైన దాని టీజర్ ఆకట్టుకుంది. దీంతో పాటుగా నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మాయా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సుధీర్ హీరోగా ఇంకో సినిమా అనౌన్స్ అయింది. జ్ఞానశేఖర్ అనే కొత్త దర్శకుడితో అతను చేస్తున్న ఈ సినిమాకు ‘హరోం హర’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీని టైటిల్ వీడియో చూస్తే సుధీర్ ఇప్పటిదాకా చేసిన సినిమాలకు భిన్నంగా డివోషనల్ యాంగిల్లో సాగే సినిమాలా కనిపిస్తోంది. 1989 నాటి కుప్పం నేపథ్యంలో సాగే కథ ఇదట.
This post was last modified on October 31, 2022 10:13 pm
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…