టాలీవుడ్ లో కొందరు దర్శకులకు ఓ సెపరేట్ బ్రాండ్ ఉంది. అందులో కృష్ణవంశీ ఒకరు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆయన బ్రాండ్ పడిపోయింది. ప్రేక్షకుల్లో ఆయన మీద ఉన్న రెస్పక్ట్ అలానే ఉంది కానీ ఆయన సినిమాల మీద మాత్రం ఎవరికీ అంచనాలు ఉండట్లేదు. నిజానికి సక్సెస్ ,ఫెయిల్ సంబంధం లేకుండా కొందరికి మార్కెట్ ఉంటుంది కానీ కృష్ణవంశీ మార్కెట్ ఇప్పుడు డల్ గానే ఉంది. ‘మొగుడు’, ‘పైసా’, ‘గోవిందుడు అందరివాడేలె’ ‘నక్షత్రం’ సినిమాలు వంశీ మార్కెట్ ను బాగా దెబ్బ తీశాయి.
దీంతో ఆయన తీసిన ‘రంగమార్తాండ’ కి ఇప్పుడు బిజినెస్ కష్టాలు ఎదురవుతున్నాయి. సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. మధ్యలో ప్రకాష్ రాజ్ డేట్స్ వల్ల కాస్త ఆలస్యం జరిగింది. మొన్నీ మధ్యే మిగిలిన నాలుగైదు రోజుల షూట్ కూడా పూర్తయింది. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ కృష్ణవంశీ మీడియా ముందుకొచ్చి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలేవి సినిమాకు ప్లస్ అవ్వలేదు. పైగా కృష్ణవంశీ గత సినిమాలా మీదే ఎక్కువ మాట్లాడి మీడియాకి కావాల్సిన స్టఫ్ ఇచ్చారు. ఇంకా సినిమాకు బిజినెస్ అవ్వలేదని తెలుస్తుంది.
తాజాగా కృష్ణవంశీ తన సోషల్ మీడియాలో బ్రహ్మానందం , రమ్య కృష్ణ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు. కొన్ని నెలల క్రితం డబ్బింగ్ మొదలైంది. ఇప్పటికే చాలా మంది చెప్పేశారు కూడా. కానీ కృష్ణవంశీ ఇంకా డబ్బింగ్ ఫోతోలనే పెడుతూ రిలీజ్ డేట్ మాత్రం చెప్పకోవడం ఆడియన్స్ విసుగు తెప్పిస్తుంది. వంశీ సినిమా చూద్దామనుకునే కొందరు ప్రేక్షకులు డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు అంటూ మాట్లాడుకుంటున్నారు. మరాఠి నటసామ్రాట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. రమ్య కృష్ణ ,బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి రంగమార్తండ రిలీజ్ మోక్షం ఎప్పుడు కలుగుతుందో ?
This post was last modified on October 31, 2022 1:03 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…