నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈవెంట్ కి విచ్చేసిన అందరూ బాలయ్య ముందు మాట్లాడటానికి భయపడుతూ ఏవో చిన్న చిన్న స్పీచులతో ముగించారు. అయితే అల్లు శిరీష్ మాత్రం ఒక అడుగు ముందుకేసి బాలయ్య ను కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు. అందులో మొదటి క్వశ్చన్ మీరు నటించిన హీరోయిన్స్ లో ఎవరు ఊర్వసి ఎవరు రాక్షసి ? ముందుగా విజయశాంతి అని శిరీష్ అడగ్గానే బాలయ్య ఇంకా పేర్లు చెప్పు అంటూ మిగతా ఆప్షన్స్ అడిగాడు. అందులో నయనతార ఊర్వసి , శృతి హాసన్ రాక్షసి అని చెప్పాడు.
ఇక ఈవెంట్ లో మీరు నటించిన సింహం టైటిల్ తో ఓ సినిమా ఉంది నేను చెప్పిన వాటిలో అది లేదు ఏమా సినిమా ? అంటూ బాలయ్య ని అడిగాడు శిరీష్. వెంటనే బాలయ్య బొబ్బిలి సింహం అనేసరికి అది కాదు ‘సింహం నవ్వింది ‘ అంటూ శిరీష్ టైటిల్ చెప్పే సరికి అది ఆడలేదు కదా అయినా సింహం నవ్వింది ఏంటి ? సింహం ఎక్కడైనా నవ్వుతుందా ? నా ఫ్లాప్ సినిమాలను గుర్తుచేస్తున్నావ్ ఏమిటి ? అంటూ చమత్కరించాడు బాలయ్య.
చివరిగా శిరీష్ మీ సినిమాలో నాకు ఓ కేరెక్టర్ ఇవ్వాలి అంటూ బాలయ్య ముందు తన మనసులో ఉన్న ఆలోచన భయపెట్టి అడిగాడు. వెంటనే బాలయ్య పరశురాం అంటూ ఆ దర్శకుడి పేరు పలుకుతూ చూడమ్మా కథ సిద్దం చెయ్, నేను శిరీష్ ని చెదగొట్టడమా ? లేదా శిరీష్ నన్ను చెడగొట్టడమా ? అలాంటి కథేమైనా ఉంటే చెప్పు అంటూ బాల్ పరశురాం కోర్టులో వేసేశాడు. ఇక శిరీష్ ని పెళ్ళెప్పుడు ? అంటూ చాలా సార్లు బాలయ్య ప్రశించగా శిరీష్ మాత్రం ఆ ప్రశ్నకి సమాదానం ఇవ్వకుండా దాటేస్తూ వచ్చాడు. ఏదేమైనా బాలయ్య రాకతో శిరీష్ సినిమాకు సోషల్ మీడియాలో కావలిసినంత బజ్ వచ్చేసింది.
This post was last modified on October 31, 2022 9:42 am
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…
అమెరికా ఇటీవల భారత్కు చెందిన అక్రమ వలసదారులను ప్రత్యేక విమానంలో పంపిన నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్…
ఇదిగో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే..అదుగో ప్లాంట్ మూసేస్తున్నారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏకంగా…
వైసీపీ అధినేత జగన్ నివాసం కమ్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ప్యాలస్కు గుర్తు తెలియని…
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ…
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో నారా భువనేశ్వరి.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మ్యూజికల్…