నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘ఊర్వసివో రాక్షసివో’ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈవెంట్ కి విచ్చేసిన అందరూ బాలయ్య ముందు మాట్లాడటానికి భయపడుతూ ఏవో చిన్న చిన్న స్పీచులతో ముగించారు. అయితే అల్లు శిరీష్ మాత్రం ఒక అడుగు ముందుకేసి బాలయ్య ను కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు. అందులో మొదటి క్వశ్చన్ మీరు నటించిన హీరోయిన్స్ లో ఎవరు ఊర్వసి ఎవరు రాక్షసి ? ముందుగా విజయశాంతి అని శిరీష్ అడగ్గానే బాలయ్య ఇంకా పేర్లు చెప్పు అంటూ మిగతా ఆప్షన్స్ అడిగాడు. అందులో నయనతార ఊర్వసి , శృతి హాసన్ రాక్షసి అని చెప్పాడు.
ఇక ఈవెంట్ లో మీరు నటించిన సింహం టైటిల్ తో ఓ సినిమా ఉంది నేను చెప్పిన వాటిలో అది లేదు ఏమా సినిమా ? అంటూ బాలయ్య ని అడిగాడు శిరీష్. వెంటనే బాలయ్య బొబ్బిలి సింహం అనేసరికి అది కాదు ‘సింహం నవ్వింది ‘ అంటూ శిరీష్ టైటిల్ చెప్పే సరికి అది ఆడలేదు కదా అయినా సింహం నవ్వింది ఏంటి ? సింహం ఎక్కడైనా నవ్వుతుందా ? నా ఫ్లాప్ సినిమాలను గుర్తుచేస్తున్నావ్ ఏమిటి ? అంటూ చమత్కరించాడు బాలయ్య.
చివరిగా శిరీష్ మీ సినిమాలో నాకు ఓ కేరెక్టర్ ఇవ్వాలి అంటూ బాలయ్య ముందు తన మనసులో ఉన్న ఆలోచన భయపెట్టి అడిగాడు. వెంటనే బాలయ్య పరశురాం అంటూ ఆ దర్శకుడి పేరు పలుకుతూ చూడమ్మా కథ సిద్దం చెయ్, నేను శిరీష్ ని చెదగొట్టడమా ? లేదా శిరీష్ నన్ను చెడగొట్టడమా ? అలాంటి కథేమైనా ఉంటే చెప్పు అంటూ బాల్ పరశురాం కోర్టులో వేసేశాడు. ఇక శిరీష్ ని పెళ్ళెప్పుడు ? అంటూ చాలా సార్లు బాలయ్య ప్రశించగా శిరీష్ మాత్రం ఆ ప్రశ్నకి సమాదానం ఇవ్వకుండా దాటేస్తూ వచ్చాడు. ఏదేమైనా బాలయ్య రాకతో శిరీష్ సినిమాకు సోషల్ మీడియాలో కావలిసినంత బజ్ వచ్చేసింది.
This post was last modified on October 31, 2022 9:42 am
కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…
యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…
వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…
కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…
కామారెడ్డిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మాజీ సర్పంచ్ కారును బీజేపీ కార్యకర్తలు…
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…